Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:53 AM

కండరక్షిణిత వికలాంగ బాధితులకు చేయూతనిచ్చిన నర్రి లింగస్వామి ఆరోతేజ్

కండరక్షిణిత వికలాంగ బాధితులకు చేయూతనిచ్చిన నర్రి లింగస్వామి ఆరోతేజ్

కండరక్షిణిత వికలాంగ బాధితులకు చేయూతనిచ్చిన నర్రి లింగస్వామి ఆరోతేజ్
February 17, 2026 10:49 PM 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ని జైహింద్ ఫంక్షన్ హాల్ లో నారాయణపురం మండల పరిసర ప్రాంతాల కండరక్షినిత వికలాంగ బాధితులకు నర్రి లింగస్వామిఆరోతేజ్ నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సివిఆర్ డిజేబుల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కత్తుల బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కండరక్షిణిత వెన్నుముక బాధితులమైన మేము ఒంటరిగా పనిచేసుకోలేము మాకు ఒక మనిషి సహాయం ఉంటేనే తప్ప మా పని మేము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము కావున మా యొక్క తీవ్రమైన సమస్యను గౌరవ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు ఒక వ్యక్తిగత సహాయకులను, 15వేల రూపాయల పెన్షన్ కల్పించాలని విన్నవించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణపురం మండలం కేంద్రానికి చెందిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై కండరక్షిణిత మరియు వెన్నుముక బాధితులను చూసి చలించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను విన్నవిస్తానని తెలియజేశారు దాత నర్రి లింగస్వామి ఆరోతేజ్ మాట్లాడుతూ కండర క్షినిత బాధితులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉన్నది మామూలు వికలాంగులు వేరు మీరు వికలాంగులు వేరు మీ పని మీరు చేసుకోలేని స్థితిలో ఉన్నారు మీ సమస్యనుఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు అనంతరం బాలకృష్ణ జన్మదిన వేడుకలు వికలాంగులు మరియు పదవ తరగతి స్నేహితులు కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణపురం గ్రామ ప్రజలు వికలాంగులు వారి సహాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News