కండరక్షిణిత వికలాంగ బాధితులకు చేయూతనిచ్చిన నర్రి లింగస్వామి ఆరోతేజ్
కండరక్షిణిత వికలాంగ బాధితులకు చేయూతనిచ్చిన నర్రి లింగస్వామి ఆరోతేజ్
Kathula narsimha
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ని జైహింద్ ఫంక్షన్ హాల్ లో నారాయణపురం మండల పరిసర ప్రాంతాల కండరక్షినిత వికలాంగ బాధితులకు నర్రి లింగస్వామిఆరోతేజ్ నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సివిఆర్ డిజేబుల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కత్తుల బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కండరక్షిణిత వెన్నుముక బాధితులమైన మేము ఒంటరిగా పనిచేసుకోలేము మాకు ఒక మనిషి సహాయం ఉంటేనే తప్ప మా పని మేము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము కావున మా యొక్క తీవ్రమైన సమస్యను గౌరవ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు ఒక వ్యక్తిగత సహాయకులను, 15వేల రూపాయల పెన్షన్ కల్పించాలని విన్నవించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణపురం మండలం కేంద్రానికి చెందిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై కండరక్షిణిత మరియు వెన్నుముక బాధితులను చూసి చలించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను విన్నవిస్తానని తెలియజేశారు దాత నర్రి లింగస్వామి ఆరోతేజ్ మాట్లాడుతూ కండర క్షినిత బాధితులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉన్నది మామూలు వికలాంగులు వేరు మీరు వికలాంగులు వేరు మీ పని మీరు చేసుకోలేని స్థితిలో ఉన్నారు మీ సమస్యనుఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు అనంతరం బాలకృష్ణ జన్మదిన వేడుకలు వికలాంగులు మరియు పదవ తరగతి స్నేహితులు కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణపురం గ్రామ ప్రజలు వికలాంగులు వారి సహాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి