PRINT TIME: April 07, 2026 09:04 PM
కంబాలపల్లిలో సర్పంచ్ మంజు, వార్డు సభ్యులకు ఘన సన్మానం
కంబాలపల్లిలో సర్పంచ్ మంజు, వార్డు సభ్యులకు ఘన సన్మానం
April 07, 2026 07:29 PM
24 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని కంబాలపల్లి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ మంజు మరియు వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2న ముగియడంతో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కలిసి ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామాభివృద్ధికి మంజు మరియు వార్డు సభ్యులు చేసిన సేవలను ఈ సందర్భంగా గ్రామస్థులు కొనియాడారు. వారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
సన్మాన సభలో టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, పంచాయతీ ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ వారి కృషి ప్రశంసనీయమని పేర్కొని, భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి