Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:53 PM

ఖేడ్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహణ

ఖేడ్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహణ

ఖేడ్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహణ
January 22, 2026 10:54 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

:నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజల భద్రతను లక్ష్యంగా తీసుకుని రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. నారాయణఖేడ్ నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం గురువారం డీఎస్పీ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ కార్యక్రమం ఫిబ్రవరి 23 తారీఖు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని మహా పంక్షన్ వద్ద జరగనుంది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అలాగే సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా ప్రవర్తించేలా అవగాహన కల్పించడం.ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, యువత, పెద్దలు, వృద్ధులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొని రోడ్డు భద్రత పై అవగాహన పెంపొందించుకుంటారు. పోలీసులు ప్రజలందరినీ తప్పనిసరిగా హాజరై కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన సందేశాలను తెలుసుకోవాలని కోరుతున్నారు.ప్రజల్లో రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, సురక్షిత రోడ్డు సంస్కృతిని పెంపొందించుకోవచ్చని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై విశేష అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం కూడా జరుపనున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News