Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

ఖేడ్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహణ

ఖేడ్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహణ

ఖేడ్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహణ
January 22, 2026 10:54 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

:నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజల భద్రతను లక్ష్యంగా తీసుకుని రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. నారాయణఖేడ్ నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం గురువారం డీఎస్పీ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ కార్యక్రమం ఫిబ్రవరి 23 తారీఖు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని మహా పంక్షన్ వద్ద జరగనుంది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అలాగే సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా ప్రవర్తించేలా అవగాహన కల్పించడం.ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, యువత, పెద్దలు, వృద్ధులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొని రోడ్డు భద్రత పై అవగాహన పెంపొందించుకుంటారు. పోలీసులు ప్రజలందరినీ తప్పనిసరిగా హాజరై కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన సందేశాలను తెలుసుకోవాలని కోరుతున్నారు.ప్రజల్లో రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, సురక్షిత రోడ్డు సంస్కృతిని పెంపొందించుకోవచ్చని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై విశేష అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం కూడా జరుపనున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News