ఖేడ్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహణ
ఖేడ్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహణ
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
:నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజల భద్రతను లక్ష్యంగా తీసుకుని రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. నారాయణఖేడ్ నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి
ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం గురువారం డీఎస్పీ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ కార్యక్రమం ఫిబ్రవరి 23 తారీఖు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని మహా పంక్షన్ వద్ద జరగనుంది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అలాగే సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా ప్రవర్తించేలా అవగాహన కల్పించడం.ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, యువత, పెద్దలు, వృద్ధులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొని రోడ్డు భద్రత పై అవగాహన పెంపొందించుకుంటారు. పోలీసులు ప్రజలందరినీ తప్పనిసరిగా హాజరై కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన సందేశాలను తెలుసుకోవాలని కోరుతున్నారు.ప్రజల్లో రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, సురక్షిత రోడ్డు సంస్కృతిని పెంపొందించుకోవచ్చని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై విశేష అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం కూడా జరుపనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి