Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:54 PM

ఖేడ్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ – కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

ఖేడ్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ – కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

ఖేడ్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ – కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
February 05, 2026 06:59 PM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ నివాసంలో గురువారం ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ షేట్కార్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ పట్టణం 7వ వార్డు శాస్త్రి నగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొండి సాయిలుతో పాటు ఆయన అనుచరులు సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు నూతన సభ్యులు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, నాగ్రెసం పటేల్, యాదగిరి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జరుగుతున్న ఈ భారీ చేరికలు నారాయణఖేడ్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News