Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:51 PM

ఖేడ్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ – కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

ఖేడ్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ – కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

ఖేడ్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ – కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
February 05, 2026 06:59 PM 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ నివాసంలో గురువారం ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ షేట్కార్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ పట్టణం 7వ వార్డు శాస్త్రి నగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొండి సాయిలుతో పాటు ఆయన అనుచరులు సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు నూతన సభ్యులు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, నాగ్రెసం పటేల్, యాదగిరి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జరుగుతున్న ఈ భారీ చేరికలు నారాయణఖేడ్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News