ఖేడ్ పట్టణానికి గురు బసవ పట్టదేవర ఆశీస్సులు – మున్సిపల్ నాగేష్ శెట్కార్కు ఘన సన్మానం
ఖేడ్ పట్టణానికి గురు బసవ పట్టదేవర ఆశీస్సులు – మున్సిపల్ నాగేష్ శెట్కార్కు ఘన సన్మానం
Krishna
నారాయణాఖేడ్ మున్సిపల్ పరిధిలోని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో షేట్కార్ కుటుంబ గురువు గురు బసవ పట్టదేవరు విచ్చేశారు. బాల్కి ప్రాంతానికి చెందిన గురు బసవ పట్టదేవరు ఆశీస్సులతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.ఖేడ్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన నాగేష్ శెట్కార్ను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆశీర్వదించారు.కార్యక్రమానికి ముందుగా గురువుకు ఘన స్వాగతం పలికి, సంప్రదాయ పద్ధతిలో పాదపూజ నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభావతి ,ఈ సందర్భంగా ప్రభావతి షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్,యువనాయకలు సాగర్ షేట్కార్,మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, నాగశెట్టి, చంద్రశేఖర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం ఆప్యాయతతో, ఆనందోత్సాహాలతో ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి