ఖేడ్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యం
ఖేడ్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యం
Krishna
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా 2, 3, 4వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి ప్రజలను కోరారు.2వ వార్డు నుంచి మంజుల దుర్గయ్య,3వ వార్డు నుంచి స్వప్న అభిషేక్ షెత్కార్,4వ వార్డు నుంచి అభిషేక్ షెత్కార్బిఆర్ఎస్ తరఫున కారు గుర్తుపై పోటీ చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఓటరు తమ విలువైన ఓటును కారు గుర్తుకు వేసి బిఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ…తాను ఎమ్మెల్యేగా ఉన్న బిఆర్ఎస్ పాలనలో నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి విశేషంగా కృషి చేశామని తెలిపారు. పట్టణంలోని ప్రతి గల్లీకి సీసీ రోడ్లు నిర్మించామని, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత బిఆర్ఎస్కే దక్కుతుందని చెప్పారు.అలాగే నారాయణఖేడ్ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఆక్సిజన్ పార్క్ వంటి కీలక వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్కు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ఖేడ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ముందుకు సాగుతుందని, ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘన విజయం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి