ఖేడ్ లో ఏఐటీయూసీ డైరీ ఆవిష్కరించిన:ఖేఢ్ ఎమ్మెల్యే
ఖేడ్ లో ఏఐటీయూసీ డైరీ ఆవిష్కరించిన:ఖేఢ్ ఎమ్మెల్యే
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మండలం,జూకల్ శివారులో ఉన్న సభాభవనంలో ఈ రోజు ఏఐటీయూసీ రెండువేల ఇరవై ఆరు డైరీని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ, శ్రామికుల సంక్షేమం మరియు వారి హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు.సంఘం విడుదల చేసిన ఈ డైరీ, రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని అన్నారు.అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, ఈ అంశం ముఖ్యమంత్రి మరియు మంత్రి సీతక్క దృష్టిలో ఉందని తెలిపారు.త్వరలోనే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యేలా తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సొంత భవనాలు లేని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో భోజీ రెడ్డి (మండల కాంగ్రెస్ అధ్యక్షులు), చిరంజీవి, ఏఐటీయూసీ సభ్యులు మరియు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి