Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:38 PM

ఖేడ్ లో ఏఐటీయూసీ డైరీ ఆవిష్కరించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

ఖేడ్ లో ఏఐటీయూసీ డైరీ ఆవిష్కరించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

ఖేడ్ లో ఏఐటీయూసీ డైరీ ఆవిష్కరించిన:ఖేఢ్ ఎమ్మెల్యే
04-02-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మండలం,జూకల్ శివారులో ఉన్న సభాభవనంలో ఈ రోజు ఏఐటీయూసీ రెండువేల ఇరవై ఆరు డైరీని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ, శ్రామికుల సంక్షేమం మరియు వారి హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు.సంఘం విడుదల చేసిన ఈ డైరీ, రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని అన్నారు.అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, ఈ అంశం ముఖ్యమంత్రి మరియు మంత్రి సీతక్క దృష్టిలో ఉందని తెలిపారు.త్వరలోనే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యేలా తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సొంత భవనాలు లేని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో భోజీ రెడ్డి (మండల కాంగ్రెస్ అధ్యక్షులు), చిరంజీవి, ఏఐటీయూసీ సభ్యులు మరియు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఖేడ్ లో ఏఐటీయూసీ డైరీ ఆవిష్కరించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మండలం,జూకల్ శివారులో ఉన్న సభాభవనంలో ఈ రోజు ఏఐటీయూసీ రెండువేల ఇరవై ఆరు డైరీని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ, శ్రామికుల సంక్షేమం మరియు వారి హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు.సంఘం విడుదల చేసిన ఈ డైరీ, రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని అన్నారు.అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, ఈ అంశం ముఖ్యమంత్రి మరియు మంత్రి సీతక్క దృష్టిలో ఉందని తెలిపారు.త్వరలోనే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యేలా తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సొంత భవనాలు లేని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో భోజీ రెడ్డి (మండల కాంగ్రెస్ అధ్యక్షులు), చిరంజీవి, ఏఐటీయూసీ సభ్యులు మరియు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News