Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:24 AM

ఖేడ్ గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

ఖేడ్ గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

ఖేడ్ గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
03-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాథోడ్ సురేష్ నాయక్ మాట్లాడుతూ, నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజనలో ఈ ప్రాంతానికి గిరిజనుల ప్రాతినిధ్యం కల్పించడం అత్యవసరమని తెలిపారు. ఈ నియోజకవర్గంలో గిరిజనుల ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు వారి అభివృద్ధిపై సరైన దృష్టి పడలేదని ఆయన అన్నారు.గత అనేక సంవత్సరాలుగా గిరిజన తండాలు అభివృద్ధిలో వెనుకబడి ఉండగా, ఇప్పటికీ చాలా చోట్ల రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేవని, పల్లెబస్సు కూడా చేరని తండాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల లేమితో ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో గిరిజనులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. పట్టణాల్లో కూడా ఖేడ్ ప్రాంతానికి చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో కూలీ పనుల కోసం కనిపిస్తుండటం వారి పరిస్థితిని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. కాబట్టి రాబోయే నియోజకవర్గాల విభజనలో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

ఖేడ్ గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

Article Image

సంగారెడ్డి జిల్లా ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాథోడ్ సురేష్ నాయక్ మాట్లాడుతూ, నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజనలో ఈ ప్రాంతానికి గిరిజనుల ప్రాతినిధ్యం కల్పించడం అత్యవసరమని తెలిపారు. ఈ నియోజకవర్గంలో గిరిజనుల ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు వారి అభివృద్ధిపై సరైన దృష్టి పడలేదని ఆయన అన్నారు.గత అనేక సంవత్సరాలుగా గిరిజన తండాలు అభివృద్ధిలో వెనుకబడి ఉండగా, ఇప్పటికీ చాలా చోట్ల రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేవని, పల్లెబస్సు కూడా చేరని తండాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల లేమితో ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో గిరిజనులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. పట్టణాల్లో కూడా ఖేడ్ ప్రాంతానికి చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో కూలీ పనుల కోసం కనిపిస్తుండటం వారి పరిస్థితిని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. కాబట్టి రాబోయే నియోజకవర్గాల విభజనలో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News