ఖేడ్ గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
ఖేడ్ గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
Krishna
సంగారెడ్డి జిల్లా ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాథోడ్ సురేష్ నాయక్ మాట్లాడుతూ, నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజనలో ఈ ప్రాంతానికి గిరిజనుల ప్రాతినిధ్యం కల్పించడం అత్యవసరమని తెలిపారు. ఈ నియోజకవర్గంలో గిరిజనుల ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు వారి అభివృద్ధిపై సరైన దృష్టి పడలేదని ఆయన అన్నారు.గత అనేక సంవత్సరాలుగా గిరిజన తండాలు అభివృద్ధిలో వెనుకబడి ఉండగా, ఇప్పటికీ చాలా చోట్ల రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేవని, పల్లెబస్సు కూడా చేరని తండాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల లేమితో ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో గిరిజనులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. పట్టణాల్లో కూడా ఖేడ్ ప్రాంతానికి చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో కూలీ పనుల కోసం కనిపిస్తుండటం వారి పరిస్థితిని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. కాబట్టి రాబోయే నియోజకవర్గాల విభజనలో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి