Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 09:21 PM

ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా

ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా

ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా
April 03, 2026 06:50 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మానవాళి పాప పరిహారార్థం సిలువపై ప్రాణాలు అర్పించిన యేసు

క్రీస్తు మరణం ప్రేమ, క్షమ, త్యాగానికి ప్రతీక

బిషప్ దుర్గం హెప్సిబా ప్రభాకర్

సూర్యాపేట పట్టణం 4వ వార్డు ఖాసీంపేటలోని బేతెస్థ ప్రార్థనా మందిరంలో శుభ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ దుర్గం హెప్సిబా ప్రభాకర్ మాట్లాడుతూ, యేసు క్రీస్తును సిలువ వేయడం, కల్వరి కొండపై ఆయన మరణం క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే కాక సమస్త మానవాళికి రక్షణకు ప్రతీక అని తెలిపారు.

పవిత్ర వారం లో భాగంగా ఈస్టర్ ఆదివారం కు ముందు వచ్చే శుక్రవారం రోజున యేసు క్రీస్తు మానవాళి పాప విమోచనార్థం తన ప్రాణాలను అర్పించుకున్నాడని తెలిపారు. ఈ రోజును శుభ శుక్రవారం, మహా శుక్రవారం అని కూడా పిలుస్తారని వివరించారు.

క్రీస్తు సువార్తల ప్రకారం శుక్రవారం రోజునే సిలువ వేయబడినట్టు పేర్కొన్నారు. ఖగోళ మరియు ధార్మిక ఆధారాల ప్రకారం ఆ సంఘటనలు విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాయని వివరించారు. యేసు సిలువపై మరణించినప్పుడు ప్రకృతిలో సంభవించిన మార్పులు కూడా విశ్వాసానికి బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తీతు, బాబు, ఉపేందర్, యేసుపాదం, వెంకన్న, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News