ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా
ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా
Biksham
మానవాళి పాప పరిహారార్థం సిలువపై ప్రాణాలు అర్పించిన యేసు
క్రీస్తు మరణం ప్రేమ, క్షమ, త్యాగానికి ప్రతీక
బిషప్ దుర్గం హెప్సిబా ప్రభాకర్
సూర్యాపేట పట్టణం 4వ వార్డు ఖాసీంపేటలోని బేతెస్థ ప్రార్థనా మందిరంలో శుభ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ దుర్గం హెప్సిబా ప్రభాకర్ మాట్లాడుతూ, యేసు క్రీస్తును సిలువ వేయడం, కల్వరి కొండపై ఆయన మరణం క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే కాక సమస్త మానవాళికి రక్షణకు ప్రతీక అని తెలిపారు.
పవిత్ర వారం లో భాగంగా ఈస్టర్ ఆదివారం కు ముందు వచ్చే శుక్రవారం రోజున యేసు క్రీస్తు మానవాళి పాప విమోచనార్థం తన ప్రాణాలను అర్పించుకున్నాడని తెలిపారు. ఈ రోజును శుభ శుక్రవారం, మహా శుక్రవారం అని కూడా పిలుస్తారని వివరించారు.
క్రీస్తు సువార్తల ప్రకారం శుక్రవారం రోజునే సిలువ వేయబడినట్టు పేర్కొన్నారు. ఖగోళ మరియు ధార్మిక ఆధారాల ప్రకారం ఆ సంఘటనలు విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాయని వివరించారు. యేసు సిలువపై మరణించినప్పుడు ప్రకృతిలో సంభవించిన మార్పులు కూడా విశ్వాసానికి బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తీతు, బాబు, ఉపేందర్, యేసుపాదం, వెంకన్న, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి