Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా

ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా

ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా
April 03, 2026 06:50 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మానవాళి పాప పరిహారార్థం సిలువపై ప్రాణాలు అర్పించిన యేసు

క్రీస్తు మరణం ప్రేమ, క్షమ, త్యాగానికి ప్రతీక

బిషప్ దుర్గం హెప్సిబా ప్రభాకర్

సూర్యాపేట పట్టణం 4వ వార్డు ఖాసీంపేటలోని బేతెస్థ ప్రార్థనా మందిరంలో శుభ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ దుర్గం హెప్సిబా ప్రభాకర్ మాట్లాడుతూ, యేసు క్రీస్తును సిలువ వేయడం, కల్వరి కొండపై ఆయన మరణం క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే కాక సమస్త మానవాళికి రక్షణకు ప్రతీక అని తెలిపారు.

పవిత్ర వారం లో భాగంగా ఈస్టర్ ఆదివారం కు ముందు వచ్చే శుక్రవారం రోజున యేసు క్రీస్తు మానవాళి పాప విమోచనార్థం తన ప్రాణాలను అర్పించుకున్నాడని తెలిపారు. ఈ రోజును శుభ శుక్రవారం, మహా శుక్రవారం అని కూడా పిలుస్తారని వివరించారు.

క్రీస్తు సువార్తల ప్రకారం శుక్రవారం రోజునే సిలువ వేయబడినట్టు పేర్కొన్నారు. ఖగోళ మరియు ధార్మిక ఆధారాల ప్రకారం ఆ సంఘటనలు విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాయని వివరించారు. యేసు సిలువపై మరణించినప్పుడు ప్రకృతిలో సంభవించిన మార్పులు కూడా విశ్వాసానికి బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తీతు, బాబు, ఉపేందర్, యేసుపాదం, వెంకన్న, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News