Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:02 PM

కేవైసీపై బీబీనగర్‌లో అవగాహన ర్యాలీ

కేవైసీపై బీబీనగర్‌లో అవగాహన ర్యాలీ

కేవైసీపై బీబీనగర్‌లో అవగాహన ర్యాలీ
February 10, 2026 04:15 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా బీబీనగర్‌లో “కేవైసీ – సురక్షిత బ్యాంకింగ్‌కు మీ మొదటి అడుగు” అనే అంశంతో వాక్‌థాన్ నిర్వహించారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకింగ్ లావాదేవీల్లో కేవైసీ అత్యంత కీలకమని వక్తలు వివరించారు. అనుమానాస్పద కాల్స్‌, సందేశాలు, లింకులకు స్పందించవద్దని ప్రజలకు సూచించారు. వ్యక్తిగత వివరాలను ఎవరికీ తెలియజేయకూడదని హెచ్చరించారు.

కేవైసీ పూర్తిచేసుకోవడం ద్వారా బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టవచ్చని, సురక్షిత లావాదేవీలకు ఇది తొలి అడుగని వక్తలు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగితే ప్రజలు ఆర్థికంగా మరింత భద్రంగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయ ప్రధాన అధికారి లక్ష్మీ శ్రావ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే. శివ రామ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జాకీరోద్దిన్, డీఆర్‌డీవో సర్ప్ డీపీఎం వెంకటేశం, బీబీనగర్ ఏపీఎం మీనా, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సిఎఫ్‌ఎల్ కౌన్సెలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News