Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:24 PM

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో
February 01, 2026 12:00 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో . మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని సిట్ విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజల తీర్పుతో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిపై కక్షపూరిత చర్యలు తగవని వారు మండిపడ్డారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రైతు–పేదల పక్షాన అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలను బీఆర్‌ఎస్ శ్రేణులు క్షమించవని హెచ్చరించారు.

రాస్తారోకో కారణంగా కొంతసేపు నార్కెట్‌పల్లి–నల్లగొండ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం నిరసనకారులు శాంతియుతంగా తమ కార్యక్రమాన్ని ముగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News