Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:19 AM

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో
February 01, 2026 12:00 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో . మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని సిట్ విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజల తీర్పుతో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిపై కక్షపూరిత చర్యలు తగవని వారు మండిపడ్డారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రైతు–పేదల పక్షాన అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలను బీఆర్‌ఎస్ శ్రేణులు క్షమించవని హెచ్చరించారు.

రాస్తారోకో కారణంగా కొంతసేపు నార్కెట్‌పల్లి–నల్లగొండ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం నిరసనకారులు శాంతియుతంగా తమ కార్యక్రమాన్ని ముగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News