Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో
February 01, 2026 12:00 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో . మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని సిట్ విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజల తీర్పుతో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిపై కక్షపూరిత చర్యలు తగవని వారు మండిపడ్డారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రైతు–పేదల పక్షాన అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలను బీఆర్‌ఎస్ శ్రేణులు క్షమించవని హెచ్చరించారు.

రాస్తారోకో కారణంగా కొంతసేపు నార్కెట్‌పల్లి–నల్లగొండ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం నిరసనకారులు శాంతియుతంగా తమ కార్యక్రమాన్ని ముగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News