కేపీహెచ్బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు
కేపీహెచ్బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు
Krishna
హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కేపీహెచ్బీ పరిధిలోని సీబీసీఐడీ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఆమె పని చేస్తోంది. గురువారం కార్యాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కుటుంబ సభ్యులు మరియు సహచరులను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి