Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:50 PM

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు
February 07, 2026 02:08 AM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్‌లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కేపీహెచ్‌బీ పరిధిలోని సీబీసీఐడీ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఆమె పని చేస్తోంది. గురువారం కార్యాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కుటుంబ సభ్యులు మరియు సహచరులను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News