Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:47 PM

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు
February 07, 2026 02:08 AM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్‌లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కేపీహెచ్‌బీ పరిధిలోని సీబీసీఐడీ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఆమె పని చేస్తోంది. గురువారం కార్యాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కుటుంబ సభ్యులు మరియు సహచరులను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News