Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:45 PM

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు
07-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్‌లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కేపీహెచ్‌బీ పరిధిలోని సీబీసీఐడీ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఆమె పని చేస్తోంది. గురువారం కార్యాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కుటుంబ సభ్యులు మరియు సహచరులను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Sthanikam

కేపీహెచ్‌బీలో యువతి అనుమానాస్పద మృతి… కారణాలపై దర్యాప్తు

Article Image

హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్‌లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కేపీహెచ్‌బీ పరిధిలోని సీబీసీఐడీ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఆమె పని చేస్తోంది. గురువారం కార్యాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కుటుంబ సభ్యులు మరియు సహచరులను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News