కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం ; మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం ; మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య
Bandi Kiran Kumar
తుంగతుర్తి;కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయించడం లో పక్ష పాత వైఖరి చూపించిందనీ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రానికి కావాల్సిన వ్యవసాయరoగానికి. రైల్వే. విమానయానా. రంగాలకు నిధులు కేటాయించ లేదనీ ఆరోపించారు.ఉపాధి కల్పనా రంగం లో కూడా సరియైన నిధులు కేటాయించడం లో బజ్ప్రపి భుత్వం విఫలమైంది. రాష్ట్ర ప్రజలు 8మంది. కాంగ్రెస్ ఎంపీ లను. 8మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి నిధులు తేవడం లో విఫల మయ్యారని.. అదే కేసీఆర్ నాయకత్వం లో ఎంపీ లను గెలిపిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని.. రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నిధులు రాబట్టడం లో వైఫల్యం చెందిందని. అందుకే ప్రజలు వాస్తవ రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకొని. కాంగ్రెస్. బజ్పాపిర్టీ లకు భవిష్యత్ లో తగిన బుద్ది చెప్పాలని అన్నారు.. తిరిగి రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చే విధంగా ప్రజలు సమాయాత్తం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో జిల్లానాయకులు గుండగాని రాములుగౌడ్. మండల నాయకులు తునికి సాయిలు గౌడ్. గోపగాని రమేష్ గౌడ్. చింతకుంట్ల భాస్కర్ గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి