Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:44 PM

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు
March 26, 2026 08:24 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు వందల మందికి ఉచిత నిర్ధారణ పరీక్షలు – ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శిబిరం

క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే నివారణ సులభమవుతుందని, అందుకోసం అవగాహనతో పాటు నిర్ధారణ పరీక్షలు కీలకమని ఎంఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత కొల్లు మధుసూదన్ రావు, కొంగర భవాని ట్రస్టు అధ్యక్షుడు కొంగర రామచంద్రరావు తెలిపారు. కీ.శే. కొంగరి భవాని స్మారకార్థం, ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన సంస్థ సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం గురువారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఉన్న ఎంఎస్ఆర్ కిడ్జ్ పాఠశాలలో ఈ శిబిరాన్ని ప్రారంభించి వారు మాట్లాడుతూ నేటి సమాజంలో క్యాన్సర్ ప్రమాదకర వ్యాధిగా మారిందన్నారు. చాలాసార్లు చివరి దశలోనే గుర్తించబడడంతో చికిత్స కష్టమై ప్రాణాపాయం పెరుగుతోందని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చుతో చికిత్స పొందవచ్చని చెప్పారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విభాగాధిపతి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అనుమానాస్పద గడ్డలు, మానని పుండ్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించవని, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకుంటే ముందస్తు గుర్తింపు సాధ్యమవుతుందని తెలిపారు.ముందస్తుగా నమోదు చేసుకున్న రెండు వందల మందితో పాటు మరో వందమందికి మొత్తం సుమారు మూడు వందల మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ప్రతినిధి కొల్లు శ్రీనివాసరావు, చేతన ఫౌండేషన్ అధ్యక్షుడు సీతారామయ్య, వైద్యులు రవిశంకర్, శైలజ, మాన్విత, రేడియాలజీ నిపుణుడు ప్రభాకర్, నర్సింగ్ సిబ్బంది, సూర్యాపేట చందన నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News