Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 10:07 PM

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు
March 26, 2026 08:24 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు వందల మందికి ఉచిత నిర్ధారణ పరీక్షలు – ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శిబిరం

క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే నివారణ సులభమవుతుందని, అందుకోసం అవగాహనతో పాటు నిర్ధారణ పరీక్షలు కీలకమని ఎంఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత కొల్లు మధుసూదన్ రావు, కొంగర భవాని ట్రస్టు అధ్యక్షుడు కొంగర రామచంద్రరావు తెలిపారు. కీ.శే. కొంగరి భవాని స్మారకార్థం, ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన సంస్థ సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం గురువారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఉన్న ఎంఎస్ఆర్ కిడ్జ్ పాఠశాలలో ఈ శిబిరాన్ని ప్రారంభించి వారు మాట్లాడుతూ నేటి సమాజంలో క్యాన్సర్ ప్రమాదకర వ్యాధిగా మారిందన్నారు. చాలాసార్లు చివరి దశలోనే గుర్తించబడడంతో చికిత్స కష్టమై ప్రాణాపాయం పెరుగుతోందని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చుతో చికిత్స పొందవచ్చని చెప్పారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విభాగాధిపతి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అనుమానాస్పద గడ్డలు, మానని పుండ్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించవని, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకుంటే ముందస్తు గుర్తింపు సాధ్యమవుతుందని తెలిపారు.ముందస్తుగా నమోదు చేసుకున్న రెండు వందల మందితో పాటు మరో వందమందికి మొత్తం సుమారు మూడు వందల మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ప్రతినిధి కొల్లు శ్రీనివాసరావు, చేతన ఫౌండేషన్ అధ్యక్షుడు సీతారామయ్య, వైద్యులు రవిశంకర్, శైలజ, మాన్విత, రేడియాలజీ నిపుణుడు ప్రభాకర్, నర్సింగ్ సిబ్బంది, సూర్యాపేట చందన నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News