స్థానికం ప్రతినిధి
జనగామ జిల్లాలో రాజకీయ విశేషం
జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో గ్రామ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. కూతురు సర్పంచ్గా, తండ్రి ఉపసర్పంచ్గా ఎన్నికవడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ మద్దతుతో పోటీ చేసిన గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్గా విజయం సాధించారు. అనంతరం జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వార్డు సభ్యులు సమానంగా ఓట్లు వేయడంతో నిర్ణాయక ఓటు హక్కు సర్పంచ్ అలేఖ్యకు వచ్చింది.
ఈ సందర్భంగా ఆమె తన ఓటును తండ్రి గొల్లపల్లి పర్శయ్యకు (బీఆర్ఎస్ మద్దతుదారు) వేయడంతో ఆయన ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక గ్రామంలో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి