కుషాయిగూడ డిపోలో మానవత్వం చాటుకున్న ఉద్యోగులు
కుషాయిగూడ డిపోలో మానవత్వం చాటుకున్న ఉద్యోగులు
Editor Desk
కుషాయిగూడ డిపో ఉద్యోగుల మానవీయత – సహోద్యోగికి రూ.63,100 ఆర్థిక సహాయం
కాప్రా, స్థానికం ప్రతినిధి
కుషాయిగూడ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు మరోసారి తమ మానవీయతను చాటుకున్నారు. డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.డి. ఫాతిమా గత రెండు నెలలుగా హార్ట్ ఆపరేషన్ అనంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న సహోద్యోగులు ఆమెకు అండగా నిలిచారు.
ఆరోగ్య సమస్యలతో పాటు కుమార్తె వివాహ బాధ్యతలు ఎదురవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మొత్తం రూ.63,100ను సమకూర్చారు. ఈ మొత్తాన్ని డిపో మేనేజర్ వేణుగోపాల్ చేతుల మీదుగా ఫాతిమాకు అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల ఐక్యత, సహానుభూతి ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. అవసర సమయంలో సహోద్యోగికి అండగా నిలవడం డిపో ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు రహీమొద్దీన్, గౌడ రవికిరణ్, సాజిద్, దుర్గేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి