Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:52 AM

కుషాయిగూడ డిపోలో మానవత్వం చాటుకున్న ఉద్యోగులు

కుషాయిగూడ డిపోలో మానవత్వం చాటుకున్న ఉద్యోగులు

కుషాయిగూడ డిపోలో మానవత్వం చాటుకున్న ఉద్యోగులు
28-12-2025 252 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుషాయిగూడ డిపో ఉద్యోగుల మానవీయత – సహోద్యోగికి రూ.63,100 ఆర్థిక సహాయం

కాప్రా, స్థానికం ప్రతినిధి

కుషాయిగూడ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు మరోసారి తమ మానవీయతను చాటుకున్నారు. డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.డి. ఫాతిమా గత రెండు నెలలుగా హార్ట్ ఆపరేషన్ అనంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న సహోద్యోగులు ఆమెకు అండగా నిలిచారు.

ఆరోగ్య సమస్యలతో పాటు కుమార్తె వివాహ బాధ్యతలు ఎదురవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మొత్తం రూ.63,100ను సమకూర్చారు. ఈ మొత్తాన్ని డిపో మేనేజర్ వేణుగోపాల్ చేతుల మీదుగా ఫాతిమాకు అందజేశారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల ఐక్యత, సహానుభూతి ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. అవసర సమయంలో సహోద్యోగికి అండగా నిలవడం డిపో ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు రహీమొద్దీన్, గౌడ రవికిరణ్, సాజిద్, దుర్గేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కుషాయిగూడ డిపోలో మానవత్వం చాటుకున్న ఉద్యోగులు

Article Image

కుషాయిగూడ డిపో ఉద్యోగుల మానవీయత – సహోద్యోగికి రూ.63,100 ఆర్థిక సహాయం

కాప్రా, స్థానికం ప్రతినిధి

కుషాయిగూడ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు మరోసారి తమ మానవీయతను చాటుకున్నారు. డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.డి. ఫాతిమా గత రెండు నెలలుగా హార్ట్ ఆపరేషన్ అనంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న సహోద్యోగులు ఆమెకు అండగా నిలిచారు.

ఆరోగ్య సమస్యలతో పాటు కుమార్తె వివాహ బాధ్యతలు ఎదురవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మొత్తం రూ.63,100ను సమకూర్చారు. ఈ మొత్తాన్ని డిపో మేనేజర్ వేణుగోపాల్ చేతుల మీదుగా ఫాతిమాకు అందజేశారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల ఐక్యత, సహానుభూతి ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. అవసర సమయంలో సహోద్యోగికి అండగా నిలవడం డిపో ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు రహీమొద్దీన్, గౌడ రవికిరణ్, సాజిద్, దుర్గేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News