కుషాయిగూడ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు 15% రాయితీ
కుషాయిగూడ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు 15% రాయితీ
స్థానికం బృందం
కుషాయిగూడ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు 15% రాయితీ
స్థానిక ప్రతినిధి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో కుషాయిగూడ ప్రాంత ప్రయాణికులకు శుభవార్త. సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులపై 15 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఈసీఐఎల్ కేంద్రంగా ప్రతిరోజూ పలు ముఖ్య రూట్లకు సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. వివరాలివీ—
ఈసీఐఎల్ – తిరుపతి : సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.960/-
ఈసీఐఎల్ – అమలాపురం : రాత్రి 7.00 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.880/-
ఈసీఐఎల్ – గుంటూరు : ఉదయం 8.00 గంటలకు, రాత్రి 9.20 గంటలకు బయలుదేరే బస్సులు, చార్జీ రూ.480/-
ఈసీఐఎల్ – కందుకూరు : రాత్రి 7.30 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.670/-
ఈ అన్ని సర్వీసులు ప్రతిరోజూ ఈసీఐఎల్ నుంచే నడుస్తాయని, కుషాయిగూడ ప్రాంత ప్రయాణికులకు 15 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు డిపో మేనేజర్ స్పష్టం చేశారు.
టికెట్ల బుకింగ్ కోసం TGSRTC ఆన్లైన్ ద్వారా లేదా బుకింగ్ కౌంటర్లలో, అవసరమైతే బస్సులో నేరుగా కూడా టికెట్ తీసుకుని ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి