Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ
December 17, 2025 07:19 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ

స్థానిక ప్రతినిధి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో కుషాయిగూడ ప్రాంత ప్రయాణికులకు శుభవార్త. సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసులపై 15 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఈసీఐఎల్ కేంద్రంగా ప్రతిరోజూ పలు ముఖ్య రూట్లకు సూపర్‌ లగ్జరీ బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. వివరాలివీ—

ఈసీఐఎల్ – తిరుపతి : సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.960/-

ఈసీఐఎల్ – అమలాపురం : రాత్రి 7.00 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.880/-

ఈసీఐఎల్ – గుంటూరు : ఉదయం 8.00 గంటలకు, రాత్రి 9.20 గంటలకు బయలుదేరే బస్సులు, చార్జీ రూ.480/-

ఈసీఐఎల్ – కందుకూరు : రాత్రి 7.30 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.670/-

ఈ అన్ని సర్వీసులు ప్రతిరోజూ ఈసీఐఎల్ నుంచే నడుస్తాయని, కుషాయిగూడ ప్రాంత ప్రయాణికులకు 15 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు డిపో మేనేజర్ స్పష్టం చేశారు.

టికెట్ల బుకింగ్ కోసం TGSRTC ఆన్‌లైన్ ద్వారా లేదా బుకింగ్ కౌంటర్లలో, అవసరమైతే బస్సులో నేరుగా కూడా టికెట్ తీసుకుని ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News