Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:41 AM

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ
December 17, 2025 07:19 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ

స్థానిక ప్రతినిధి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో కుషాయిగూడ ప్రాంత ప్రయాణికులకు శుభవార్త. సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసులపై 15 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఈసీఐఎల్ కేంద్రంగా ప్రతిరోజూ పలు ముఖ్య రూట్లకు సూపర్‌ లగ్జరీ బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. వివరాలివీ—

ఈసీఐఎల్ – తిరుపతి : సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.960/-

ఈసీఐఎల్ – అమలాపురం : రాత్రి 7.00 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.880/-

ఈసీఐఎల్ – గుంటూరు : ఉదయం 8.00 గంటలకు, రాత్రి 9.20 గంటలకు బయలుదేరే బస్సులు, చార్జీ రూ.480/-

ఈసీఐఎల్ – కందుకూరు : రాత్రి 7.30 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.670/-

ఈ అన్ని సర్వీసులు ప్రతిరోజూ ఈసీఐఎల్ నుంచే నడుస్తాయని, కుషాయిగూడ ప్రాంత ప్రయాణికులకు 15 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు డిపో మేనేజర్ స్పష్టం చేశారు.

టికెట్ల బుకింగ్ కోసం TGSRTC ఆన్‌లైన్ ద్వారా లేదా బుకింగ్ కౌంటర్లలో, అవసరమైతే బస్సులో నేరుగా కూడా టికెట్ తీసుకుని ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News