కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం
కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం
Editor Desk
కట్టంగూరులో ఘనంగా సాయిమణికంఠ మండలపూజ
కట్టంగూర్ స్థానికం ప్రతినిధి
కట్టంగూరు పట్టణ కేంద్రంలో శ్రీ సాయిమణికంఠ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ మండలపూజ, స్వామివారి అభిషేక పూజ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ హాజరై స్వామివారి విశిష్టతను వివరించారు.
ఆలయ అభివృద్ధికి దైద రవీందర్ రూ.5,116 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ZPTC సుంకరబోయిన నరసింహ యాదవ్, కట్టంగూరు గ్రామ సర్పంచ్ ముక్కాముల శ్యామల–శేఖర్, మాజీ MPP ముత్తిలింగం, చెరుకు యాదగిరి, నర్సింగ్ దుర్గయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి