కృత్రిమ కాలి సాయంతో బాలప్ప గౌడ్కు మళ్లీ నడక… భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సేవ
కృత్రిమ కాలి సాయంతో బాలప్ప గౌడ్కు మళ్లీ నడక… భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సేవ
Editor Desk
భీష్మరాజ్ ఫౌండేషన్ సాయంతో బాలప్ప గౌడ్కు కొత్త జీవితం
స్థానికం ప్రతినిధి
నారాయణపేట జిల్లా దామెరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన బాలప్ప గౌడ్కు భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సహాయం అందించి కొత్త జీవితానికి బాటలు వేసింది. కృత్రిమ కాలు అమరిక కోసం ఫౌండేషన్ తరఫున రూ.60,000 చెక్కును అందజేశారు.అనుకోని ప్రమాదంతో కాలు కోల్పోయిన బాలప్ప గౌడ్కు కృత్రిమ కాలు అందించడంతో మళ్లీ నిలబడే అవకాశం లభించింది. ఈ సందర్భంగా బాలప్ప గౌడ్ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తమలాంటి నిరుపేదలకు ఫౌండేషన్ అండగా నిలవడంఅభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొని బాలప్ప గౌడ్కు ధైర్యం చెప్పారు. అవసరంలో ఉన్నవారికి చేయూతనిచ్చే లక్ష్యంతో ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి