కృషి క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు
కృషి క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
విద్యార్థులు కృషి , క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని ఇంపాక్ట్ ఫౌండేషన్ రీజనల్ డైరెక్టర్ గూడూరు అంజిరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని లయోలా టెక్నో హై స్కూల్ లో బుధవారం రోజున మోటివేషనల్ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకున్నప్పుడే వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో పట్టుదలతో కృషి కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గురువులను గౌరవించడంతోపాటు దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మోటివేషనల్ స్పీకర్ నందికొండ రవీందర్ రెడ్డి పాఠశాల చైర్మన్ ఎన్.ఎఫ్ సుందర్ రాజ్, రీజనల్ ప్రెసిడెంట్ కోట్ల సాయికిరణ్, పాఠశాల డైరెక్టర్ తీగల కిరణ్, మూర్తల వెంకన్న, బెల్లం శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి