కరాటే రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా పేట కరాటే మాస్టర్లు
కరాటే రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా పేట కరాటే మాస్టర్లు
Biksham
200 మందితో పోటీపడి అర్హత సాధించిన సూర్యాపేట క్రీడాకారులు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
కరాటే ఇండియా ఆర్గనైజేషన్ రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా సూర్యాపేట పట్టణానికి చెందిన కరాటే మాస్టర్లు జె.వి. రమణ (చిన్న), ఆర్. సంతోష్ అర్హత సాధించారు. ఈ నెల 18న హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కియో రిఫరీ, జడ్జి పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు వందల మంది కరాటే మాస్టర్లు పాల్గొనగా సూర్యాపేటకు చెందిన ఈ ఇద్దరు మాస్టర్లు విజయం సాధించడం విశేషం.ఈ సందర్భంగా కియో రాష్ట్ర కార్యదర్శి మళయాల రామస్వామి, కోశాధికారి మల్లికార్జున్, సుమన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ వ్యవస్థాపకుడు జె. శ్రీనివాస్ చేతుల మీదుగా అర్హత పత్రాలను అందుకున్నారు. జడ్జి పరీక్షలో అర్హత సాధించిన కరాటే మాస్టర్లను కియో రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సినీ హీరో సుమన్ అభినందించారు. సూర్యాపేట క్రీడారంగానికి ఇది గర్వకారణమని పలువురు క్రీడాభిమానులు ప్రశంసించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి