Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:02 PM

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ర్యాలీ

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ర్యాలీ

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ర్యాలీ
February 12, 2026 08:46 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, కార్మికులను బానిసలుగా మారుస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురువారం చిట్యాలలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కుదించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని, కార్మికులకు కనీస వేతన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు.

ర్యాలీలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కార్మికుల సమస్యలపై సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అరూరి శ్రీను, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, అంగన్వాడీ టీచర్ల యూనియన్ నాయకురాలు దాడి అరుణ, ఫైళ్ళ పద్మ, మిల్లు డ్రైవర్ల సంఘం నాయకులు ఏళ్ల మారయ్య, తిరుపతి, మున్సిపల్ వర్కర్స్ నాయకులు పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, మేడి శోభ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు వడ్డేపల్లి శంకర్, సుక్క నర్సింహా, గ్రామ పంచాయతీ వర్కర్ నాయకులు మంకాల బాలమ్మ, సిరిపంగి యాదయ్య, సిపిఎం మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, నెలికంటి నర్సింహా, కల్లూరి కుమార స్వామి, పంది నరేష్ తదితరులు హాజరయ్యారు.

సమ్మె సందర్భంగా కార్మికులు తమ డిమాండ్లతో నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News