Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

కార్మిక నేత సాయి కుమార్‌ను గెలిపించాలి

కార్మిక నేత సాయి కుమార్‌ను గెలిపించాలి

కార్మిక నేత సాయి కుమార్‌ను గెలిపించాలి
February 08, 2026 06:40 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సిపిఎం జిల్లా నాయకులు మట్టిపల్లి సైదులు పిలుపు

సూర్యాపేట పట్టణంలోని 24వ వార్డు సిపిఎం అభ్యర్థి, కార్మిక నేత వల్లపు దాసు సాయి కుమార్‌ను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. ఆదివారం 24వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఆయన ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ, 24వ వార్డు అభివృద్ధి కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమని అన్నారు. అవినీతి రహిత పాలన కావాలంటే సిపిఎం అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వార్డులో అనేక సమస్యలు పేరుకుపోయాయని, అవి పరిష్కారం కావాలంటే ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.సిపిఎం అభ్యర్థి సాయి కుమార్ గెలిస్తే మున్సిపల్ కౌన్సిల్‌లో వార్డు సమస్యలపై గళం విప్పి పోరాడతారని తెలిపారు. కార్మిక నాయకుడిగా గత ఇరవై సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించిన వ్యక్తి సాయి కుమార్ అని గుర్తు చేశారు. అలాగే వెనుకబడిన శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం అలుపెరుగని ప్రజా ఉద్యమాలు చేపట్టారని అన్నారు.ఈ నేపథ్యంలో ప్రజలు సాయి కుమార్‌కు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగూరి గోవిందు, ధనియాకుల శ్రీకాంత్, మద్దెల జ్యోతి, వీరబోయిన రవి, శ్రీను, సిపిఎం పట్టణ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, అబ్బగాని బిక్షం, షేక్ సైదులు, ఎలుగూరి ఆశాలు, దశరథ, కవిత, రేణుక తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News