Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్ గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 10:54 PM

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..
April 06, 2026 08:46 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సిఐటియు యాదాద్రి జిల్లా కమిటి

భువనగిరి:భారత కార్మిక వర్గ పోరాట యోధుడు,సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బి.టి.రణదివె గారి 36వ (బిటీఆర్) వర్ధంతి కార్యక్రమాన్ని భువనగిరి సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,కల్లూరి మల్లేశం పాల్గొని బి.టి.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..."బి.టి. రణదివె గారు కేవలం ఒక నాయకుడే కాదు,కార్మిక వర్గానికి ఒక సిద్ధాంతకర్త అని,దేశంలో కార్మిక హక్కుల కోసం,దోపిడీ లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదనీ,నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రస్తుత పాలకులు కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని,29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు.బి.టి.ఆర్ పిలుపునిచ్చిన'ఐక్యత మరియు పోరాటం'అనే నినాదంతోనే కార్మిక లోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు,సామాజిక భద్రత కల్పించే వరకు సిఐటియు పోరాటాన్నిఉధృతం చేస్తుందని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,మాయ కృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య,ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ,వనం రాజు,చింతల శివ,బందెల ఎల్లయ్య,సుందర్,కవిత,దనమ్మ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News