Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:34 PM

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..
April 06, 2026 08:46 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సిఐటియు యాదాద్రి జిల్లా కమిటి

భువనగిరి:భారత కార్మిక వర్గ పోరాట యోధుడు,సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బి.టి.రణదివె గారి 36వ (బిటీఆర్) వర్ధంతి కార్యక్రమాన్ని భువనగిరి సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,కల్లూరి మల్లేశం పాల్గొని బి.టి.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..."బి.టి. రణదివె గారు కేవలం ఒక నాయకుడే కాదు,కార్మిక వర్గానికి ఒక సిద్ధాంతకర్త అని,దేశంలో కార్మిక హక్కుల కోసం,దోపిడీ లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదనీ,నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రస్తుత పాలకులు కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని,29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు.బి.టి.ఆర్ పిలుపునిచ్చిన'ఐక్యత మరియు పోరాటం'అనే నినాదంతోనే కార్మిక లోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు,సామాజిక భద్రత కల్పించే వరకు సిఐటియు పోరాటాన్నిఉధృతం చేస్తుందని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,మాయ కృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య,ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ,వనం రాజు,చింతల శివ,బందెల ఎల్లయ్య,సుందర్,కవిత,దనమ్మ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News