Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 AM

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..
April 06, 2026 08:46 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సిఐటియు యాదాద్రి జిల్లా కమిటి

భువనగిరి:భారత కార్మిక వర్గ పోరాట యోధుడు,సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బి.టి.రణదివె గారి 36వ (బిటీఆర్) వర్ధంతి కార్యక్రమాన్ని భువనగిరి సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,కల్లూరి మల్లేశం పాల్గొని బి.టి.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..."బి.టి. రణదివె గారు కేవలం ఒక నాయకుడే కాదు,కార్మిక వర్గానికి ఒక సిద్ధాంతకర్త అని,దేశంలో కార్మిక హక్కుల కోసం,దోపిడీ లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదనీ,నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రస్తుత పాలకులు కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని,29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు.బి.టి.ఆర్ పిలుపునిచ్చిన'ఐక్యత మరియు పోరాటం'అనే నినాదంతోనే కార్మిక లోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు,సామాజిక భద్రత కల్పించే వరకు సిఐటియు పోరాటాన్నిఉధృతం చేస్తుందని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,మాయ కృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య,ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ,వనం రాజు,చింతల శివ,బందెల ఎల్లయ్య,సుందర్,కవిత,దనమ్మ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News