కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..
కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..
Sthanikam District Staff Reporter
సిఐటియు యాదాద్రి జిల్లా కమిటి
భువనగిరి:భారత కార్మిక వర్గ పోరాట యోధుడు,సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బి.టి.రణదివె గారి 36వ (బిటీఆర్) వర్ధంతి కార్యక్రమాన్ని భువనగిరి సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,కల్లూరి మల్లేశం పాల్గొని బి.టి.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..."బి.టి. రణదివె గారు కేవలం ఒక నాయకుడే కాదు,కార్మిక వర్గానికి ఒక సిద్ధాంతకర్త అని,దేశంలో కార్మిక హక్కుల కోసం,దోపిడీ లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదనీ,నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రస్తుత పాలకులు కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని,29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు.బి.టి.ఆర్ పిలుపునిచ్చిన'ఐక్యత మరియు పోరాటం'అనే నినాదంతోనే కార్మిక లోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు,సామాజిక భద్రత కల్పించే వరకు సిఐటియు పోరాటాన్నిఉధృతం చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,మాయ కృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య,ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ,వనం రాజు,చింతల శివ,బందెల ఎల్లయ్య,సుందర్,కవిత,దనమ్మ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి