Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:01 AM

కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ

కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ

కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ
May 02, 2026 08:10 AM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి,: కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం పోచంపల్లిలో నిర్వహించిన 140వ మేడే ఉత్సవాల సందర్భంగా సిఐటియు మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సింహ మాట్లాడుతూ, 1886లో అమెరికాలోని చికాగోలో 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన పోరాట ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు.

అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా 12 గంటల పనిదినం అమలు చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్స్‌తో పాటు వివిధ చట్ట సవరణల ద్వారా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరచడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, పేదలు మరింత పేదవారిగా మారుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు, పట్టణ కన్వీనర్ వడ్డేపల్లి యాదగిరి అధ్యక్షత వహించగా, రైతు సంఘం నాయకులు, డివైఎఫ్ఐ ప్రతినిధులు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News