Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 09:39 AM

కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ

కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ

కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ
May 02, 2026 08:10 AM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి,: కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం పోచంపల్లిలో నిర్వహించిన 140వ మేడే ఉత్సవాల సందర్భంగా సిఐటియు మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సింహ మాట్లాడుతూ, 1886లో అమెరికాలోని చికాగోలో 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన పోరాట ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు.

అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా 12 గంటల పనిదినం అమలు చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్స్‌తో పాటు వివిధ చట్ట సవరణల ద్వారా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరచడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, పేదలు మరింత పేదవారిగా మారుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు, పట్టణ కన్వీనర్ వడ్డేపల్లి యాదగిరి అధ్యక్షత వహించగా, రైతు సంఘం నాయకులు, డివైఎఫ్ఐ ప్రతినిధులు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News