కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ
కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ
Editor Desk
పోచంపల్లి,: కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం పోచంపల్లిలో నిర్వహించిన 140వ మేడే ఉత్సవాల సందర్భంగా సిఐటియు మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సింహ మాట్లాడుతూ, 1886లో అమెరికాలోని చికాగోలో 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన పోరాట ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు.
అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా 12 గంటల పనిదినం అమలు చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్స్తో పాటు వివిధ చట్ట సవరణల ద్వారా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరచడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, పేదలు మరింత పేదవారిగా మారుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు, పట్టణ కన్వీనర్ వడ్డేపల్లి యాదగిరి అధ్యక్షత వహించగా, రైతు సంఘం నాయకులు, డివైఎఫ్ఐ ప్రతినిధులు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి