క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం
క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం
స్థానికం బృందం
సంఖ్యలతో సృజనాత్మక సంబరం: క్రిష్ణవేణిలో జాతీయ గణిత దినోత్సవం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సంఖ్యల మధ్య దాగిన సృజనాత్మకతను విద్యార్థులు తమ ప్రతిభతో బయటపెట్టి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
విద్యార్థులు రూపొందించిన వివిధ గణిత ప్రయోగాలు, పరిశోధన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ మేధస్సుకు తగ్గట్టుగా రూపొందించిన గణిత నమూనాలను పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అబ్బురపరిచారు. గణితం కేవలం పాఠ్యాంశం కాదని, ఆలోచనకు దారి చూపే శాస్త్రమని విద్యార్థుల ప్రదర్శనలు చాటి చెప్పాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్.మణి పాల్గొని విద్యార్థులను అభినందించారు.
గణిత ఉపాధ్యాయులు కె.లావణ్య, విజయలక్ష్మి, మాధవి, శైలజ, రషీద్, అలీం, మల్లేష్, పూనం దాస్, ఉమారాణి, వినోద, కరుణ, శ్రావణి, శ్వేత, మమత, సంధ్య, ఫారియా, టి.లావణ్య, ఎస్.ఉమారాణి, అనూష, కవిత తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి