Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:34 PM

క్రిస్మస్ రోజే రాజ్యాంగ ప్రాథమిక హక్కులపై దాడులు – మౌనంగా ప్రభుత్వాలు

క్రిస్మస్ రోజే రాజ్యాంగ ప్రాథమిక హక్కులపై దాడులు – మౌనంగా ప్రభుత్వాలు

క్రిస్మస్ రోజే రాజ్యాంగ ప్రాథమిక హక్కులపై దాడులు – మౌనంగా ప్రభుత్వాలు
December 27, 2025 06:06 PM 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్రిస్మస్ రోజే రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన – మతోన్మాద దాడులపై ఆవేదన

సూర్యాపేట, స్థానికం ప్రతినిధి

క్రిస్మస్ పండుగ రోజునే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను మతోన్మాద శక్తులు కాలరాస్తున్నాయని తెలంగాణ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.

శనివారం సూర్యాపేట పట్టణంలోని నల్లాల బావి సెంటర్, ఏపూర్ బస్టాండ్ వద్ద సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవ. జలగం జేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను హామీ ఇస్తున్నాయని, అయినా గత పదేళ్లుగా దేశవ్యాప్తంగా క్రైస్తవులపై, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మహిళలు, చర్చిలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.

ఈ దాడులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా మౌనం పాటించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మతం పేరుతో యువతను దారి మళ్లిస్తూ దేశ అభివృద్ధిని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లౌకిక భారతాన్ని కాపాడేందుకు అందరూ స్పందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్చ్ బిషప్ ఎం.పి.హెచ్.హెచ్. మోజెస్, రెవ. బొక్క ఏలీయా రాజు, పాస్టర్ వరికుప్పల మత్తయి, రెవ. పంది మార్కు, పాస్టర్ బానోత్ సుధాకర్, రెడ్డిపల్లి ప్రేమ్ సాగర్, పుల్లూరు బోయాజ్, ధరవత్ మంగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News