కరీంనగర్లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?
కరీంనగర్లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?
Editor Desk
కరీంనగర్ గడ్డమీద అసలేం జరుగుతాంది? రోజుకో వార్త వింటుంటేనే గుండె జల్ అంటుంది. తాజాగా పోలీస్ రికార్డుల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అయితంది. జనవరి 2024 నుంచి మొన్నటి అక్టోబర్ 2025 దాకా.. అంటే ఏడాదిన్నర కాలంలోనే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 567 మంది మహిళలు, యువతులు మాయమయ్యిర్రు అని కేసులు నమోదైనయ్.
ఇవి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కేసులు మాత్రమే.. పరువు కోసమో, భయం తోనో బయటకి చెప్పుకోలేక.. పోలీసుల దాకా రాని కేసులు ఇంకెన్ని ఉన్నయో ఆ దేవుడికే ఎరుక. పోలీసులు ఇందులో కొన్ని కేసులను ఛేదించి ఆచూకీ పట్టుకున్నా.. ఇంకా చాలామంది ఎటు పోయిర్రు? ఏమైపోయిర్రు? అనేది మిస్టరీగానే మిగిలిపోతాంది.
అసలు ఈ మాయం వెనుక ఏం జరుగుతాంది? కనిపించకుండా పోయినోళ్లు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటిపోతున్నరనే అనుమానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నయ్. పోలీసులు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టకపోతే పరిస్థితి ఆగమైతది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి