Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:24 PM

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు
January 18, 2026 02:23 PM 304 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై హైస్పీడ్ హడావుడి.. వరుస ప్రమాదాలు

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం తీవ్ర వాహన రద్దీ నెలకొంది. హైవేపై కార్ రేసుల్ని తలపించేలా కొందరు డ్రైవర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం కలకలం రేపింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా చిట్యాల శివారులో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

చిట్యాల శివారులో ఒకదానికొకటి తాకుతూ మూడు కార్లు వరుసగా ఢీకొన్నాయి. అధిక వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో చిట్యాల టౌన్ పరిధిలో మరో కారు డివైడర్‌ను ఢీకొనడంతో హైవేపై భయానక దృశ్యాలు కనిపించాయి.

ప్రమాదాల్లో కార్లు తీవ్రంగా ధ్వంసమైనప్పటికీ ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైవేపై తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని, పటిష్టమైన పోలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News