Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:58 AM

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు
January 18, 2026 02:23 PM 300 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై హైస్పీడ్ హడావుడి.. వరుస ప్రమాదాలు

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం తీవ్ర వాహన రద్దీ నెలకొంది. హైవేపై కార్ రేసుల్ని తలపించేలా కొందరు డ్రైవర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం కలకలం రేపింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా చిట్యాల శివారులో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

చిట్యాల శివారులో ఒకదానికొకటి తాకుతూ మూడు కార్లు వరుసగా ఢీకొన్నాయి. అధిక వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో చిట్యాల టౌన్ పరిధిలో మరో కారు డివైడర్‌ను ఢీకొనడంతో హైవేపై భయానక దృశ్యాలు కనిపించాయి.

ప్రమాదాల్లో కార్లు తీవ్రంగా ధ్వంసమైనప్పటికీ ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైవేపై తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని, పటిష్టమైన పోలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News