Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు
January 18, 2026 02:23 PM 308 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై హైస్పీడ్ హడావుడి.. వరుస ప్రమాదాలు

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం తీవ్ర వాహన రద్దీ నెలకొంది. హైవేపై కార్ రేసుల్ని తలపించేలా కొందరు డ్రైవర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం కలకలం రేపింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా చిట్యాల శివారులో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

చిట్యాల శివారులో ఒకదానికొకటి తాకుతూ మూడు కార్లు వరుసగా ఢీకొన్నాయి. అధిక వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో చిట్యాల టౌన్ పరిధిలో మరో కారు డివైడర్‌ను ఢీకొనడంతో హైవేపై భయానక దృశ్యాలు కనిపించాయి.

ప్రమాదాల్లో కార్లు తీవ్రంగా ధ్వంసమైనప్పటికీ ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైవేపై తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని, పటిష్టమైన పోలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News