Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 04:39 AM

కౌన్సిల్ తీర్మానం ను బయటపెట్టాలి అని వినతి అని వినతి

కౌన్సిల్ తీర్మానం ను బయటపెట్టాలి అని వినతి అని వినతి

 కౌన్సిల్ తీర్మానం ను బయటపెట్టాలి అని వినతి అని వినతి
January 08, 2026 09:42 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేని గూడెంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ కు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశామని ఆ మేరకే అక్కడ డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేశామని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య చెప్పడం అసత్యమని ఒకవేళ నిజమైతే కౌన్సిల్ తీర్మాన కాపీని బయటపెట్టాలని టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆయన గురువారం మున్సిపల్ కమిషనర్ను కలిసి విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందిస్తూ డంపింగ్ యార్డ్ నిర్మాణం కై ఎలాంటి తీర్మానం లేదని దీనిపై రెండు రోజుల్లో పూర్తి వివరణ ఇస్తానని ఆయన చెప్పడం జరిగిందని అన్నారు. కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఈ విధంగా చెప్పడం సరైనది కాదని తమ పార్టీ నాయకులను పార్టీని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తీర్మాన కాపీ ఉంటే బయట పెట్టాలని లేకుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు జిట్టా బొందయ్య, రుద్రారపు యాదయ్య, కన్నెబోయిన శ్రీశైలం, విటల్ రెడ్డి, పోకల రాములు, పోలేపల్లి సత్యనారాయణ, కందాటి రమేష్ రెడ్డి, బొలుగూరి సైదులు, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News