Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:15 AM

కోర్టుల భారం తగ్గించిన లోక్‌ అదాలత్‌… రామన్నపేటలో 481 కేసులు పరిష్కారం

కోర్టుల భారం తగ్గించిన లోక్‌ అదాలత్‌… రామన్నపేటలో 481 కేసులు పరిష్కారం

కోర్టుల భారం తగ్గించిన లోక్‌ అదాలత్‌… రామన్నపేటలో 481 కేసులు పరిష్కారం
December 21, 2025 05:15 PM 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

లోక్‌ అదాలత్‌తో న్యాయ పరిష్కారం… 481 కేసులకు ముగింపు

రామన్నపేట, స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట కోర్టు పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 481 కేసులు పరిష్కారమై కక్షిదారులకు న్యాయసంతృప్తి లభించింది. ఆదివారం కోర్టు హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జ్ జి. సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి డి. సత్తయ్యలు పాల్గొని కేసుల పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించారు.

రామన్నపేట జ్యుడిషియల్ పరిధిలోని రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, అడ్డగుడూరు పోలీస్ స్టేషన్‌లకు సంబంధించిన కేసుల్లో క్రిమినల్ కేసులు 112, ప్రీ లిటిగేషన్ కేసులు 2, బ్యాంక్ కేసులు 9, ఇతర పిట్టి కేసులు 358ను ఇరు పక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించారు. ముఖ్యంగా బ్యాంక్ కేసుల ద్వారా రూ. 5,95,169/- మొత్తాన్ని రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ, క్షణిక ఆవేశాలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడం వల్ల సమయం, ధనం వృథా అవుతాయని, అలాంటి పరిస్థితుల్లో లోక్‌ అదాలత్‌ రాజమార్గమే యాజమార్గం అని పేర్కొన్నారు. కోర్టు పరిధిలో నిర్వహించే లోక్‌ అదాలత్‌లను వినియోగించుకొని సమస్యలను సులభంగా, శాశ్వతంగా పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు, పలు మండలాల ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్లు, వివిధ పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News