Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:21 AM

కూలిన ఇల్లు మట్టి, చెట్ల తొలగింపుతో రాకపోకలు పునరుద్ధరణ

కూలిన ఇల్లు మట్టి, చెట్ల తొలగింపుతో రాకపోకలు పునరుద్ధరణ

కూలిన ఇల్లు మట్టి, చెట్ల తొలగింపుతో రాకపోకలు పునరుద్ధరణ
December 22, 2025 06:45 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా సమస్యకు తక్షణ పరిష్కారం… 23వ వార్డులో మట్టి తొలగింపు

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది. బ్రాహ్మణవాడ శివాలయం గల్లీలో పురాతనమైన ఇల్లు కూలి, రోడ్డుపై భారీగా మట్టి పేరుకుపోవడంతో పాటు పిచ్చి చెట్లు రోడ్డుకు అడ్డుగా రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ విషయం తెలుసుకున్న మాజీ 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ వెంటనే స్పందించి, సమస్యను మున్సిపల్ కమిషనర్ రామలింగం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది, జెసిబి సహాయంతో రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని, చెట్లను తొలగించారు. దీంతో ప్రజల రాకపోకలకు ఏర్పడిన ఆటంకం తొలగిపోయి, స్థానికులు ఊరట పొందారు.

ఈ సందర్భంగా పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ, శిథిలావస్థలో ఉన్న పురాతన ఇళ్ల యజమానులు ముందస్తు జాగ్రత్తగా వాటిని కూల్చివేసి చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. అలాగే ఓపెన్ ప్రైవేట్ ప్లాట్ల యజమానులు తమ స్థలాల్లో పిచ్చి చెట్లు, మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో చెత్త, వ్యర్థాలు వేయడం వల్ల పాములు, క్రిమికీటకాలు సంచరించి ప్రజలకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కేమోజు మల్లికార్జున్, సులోచన, పార్వతమ్మ, శారద, రంగమ్మ, జయమ్మ, శేషు, విష్ణు, వరుణ్ తేజ్, ప్రణయ్, పట్నం వేణు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News