కొమ్మినేపల్లి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కొమ్మినేపల్లి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Editor Desk
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఖమ్మం స్థానికం ప్రతినిధి
జడ్పీ ఎస్ఎస్ కొమ్మినేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఖమ్మం యూటీవైఎఫ్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 1991–92 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఒకే వేదికపై చేరి, విద్యాభ్యాస దశలోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈ సందర్భంగా సభాముఖంగా తమ కష్టసుఖాలను పంచుకుంటూ, అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో సమ్మేళనం ఉత్సాహంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పి. నాగేశ్వరావు, జె. సూర్యమ్మ, ఏ. ఉదయలక్ష్మి, యం. కృష్ణ ప్రసాద్, మురళి, జి. రాజశేఖర్, కే. ప్రభాకర్, హెచ్. భద్రు, కే. మాదారయ్య, వెంకటరమ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి