కన్సాన్పల్లి ఎంపీపీఎస్లో నూతన గ్రంథాలయ ప్రారంభం
కన్సాన్పల్లి ఎంపీపీఎస్లో నూతన గ్రంథాలయ ప్రారంభం
Krishna
రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం
మండల విద్యాశాఖాధికారి కృష్ణ
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పరిధిలో కన్సాన్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంఈఓ కృష్ణ మాట్లాడుతూ, గ్రంథాలయం అనేది విద్యార్థులకు విజ్ఞాన భాండాగారమని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ గారు, ఆర్టీఓ సంగారెడ్డి, ఏఎంవీఐ కంది శిరీష మేడం రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యం ప్రభు సార్ సేవలను అభినందించారు.అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలా దేవి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సుభద్రా దేవి, పాఠశాల ఛైర్పర్సన్ విజయతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది సుష్మ, స్రవంతి, నాగన్న, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి