Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:12 AM

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం:   మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
December 13, 2025 08:25 AM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అందుబాటులో ఉండే నాయకులకు అవకాశం ఇవ్వండి

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రామన్నపేట పట్టణంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం రామన్నపేటలో సీపీఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేశానికి మద్దతుగా నిర్వహించిన ప్రచార రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకాలేదని, మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పట్టణ అభివృద్ధికి స్పష్టమైన దృష్టికోణం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేశాన్ని ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీతో సేవ చేసే నాయకుడిగా మల్లేశం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేశంతో పాటు నాయకులు బందెల రాములు, గొరిగె నర్సింహ, పోతరాజు సాయి, ఎండీ ఆమేర్, కందుల హన్మంత్, బావండ్లపల్లి బాలరాజు, ఎస్కే చాంద్, వేమవరపు సుధీర్ బాబు, బాసాని రాజు, కల్లూరి నరేష్, మునుకుంట్ల లెనిన్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News