కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
స్థానికం బృందం
అందుబాటులో ఉండే నాయకులకు అవకాశం ఇవ్వండి
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రామన్నపేట పట్టణంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం రామన్నపేటలో సీపీఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేశానికి మద్దతుగా నిర్వహించిన ప్రచార రోడ్షోలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకాలేదని, మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పట్టణ అభివృద్ధికి స్పష్టమైన దృష్టికోణం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేశాన్ని ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీతో సేవ చేసే నాయకుడిగా మల్లేశం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేశంతో పాటు నాయకులు బందెల రాములు, గొరిగె నర్సింహ, పోతరాజు సాయి, ఎండీ ఆమేర్, కందుల హన్మంత్, బావండ్లపల్లి బాలరాజు, ఎస్కే చాంద్, వేమవరపు సుధీర్ బాబు, బాసాని రాజు, కల్లూరి నరేష్, మునుకుంట్ల లెనిన్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి