కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వెళ్లడంతో సర్పంచిగా భారీ మెజార్టీ
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వెళ్లడంతో సర్పంచిగా భారీ మెజార్టీ
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలం బోగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో BRS బలపరిచిన అభ్యర్థి కూనూరు సాయికుమార్ గౌడ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గంపల రామచంద్రారెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంతో సాయికుమార్ గౌడ్ జయకేతనం ఎగరవేశారు.
ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో కాంగ్రెస్ నేతలు సరైన మద్దతు ఇవ్వకపోవడంతో సాయికుమార్ గౌడ్ BRSలో చేరినట్లు తెలిసింది. పార్టీ మారినప్పటికీ గ్రామ ప్రజలు ఆయనకు అండగా నిలవడం విశేషం. అభివృద్ధి, స్థానిక సమస్యలపై స్పష్టమైన హామీలతో ప్రజలను ఆకట్టుకున్న సాయికుమార్ గౌడ్ వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు ఫలితాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ఇక్కడ ఎమ్మెల్యే వీరేశం ఏర్పాటు చేసిన కమిటీ గంపల రామచంద్రారెడ్డిని నామినేట్ చేసినట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో అసంతృప్తి, నాయకత్వ లోపం కాంగ్రెస్కు నష్టంగా మారినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఫలితం రామన్నపేట రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని చర్చ సాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి