Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:29 AM

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వెళ్లడంతో సర్పంచిగా భారీ మెజార్టీ

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వెళ్లడంతో సర్పంచిగా భారీ మెజార్టీ

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వెళ్లడంతో  సర్పంచిగా భారీ మెజార్టీ
14-12-2025 249 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం బోగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో BRS బలపరిచిన అభ్యర్థి కూనూరు సాయికుమార్ గౌడ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గంపల రామచంద్రారెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంతో సాయికుమార్ గౌడ్ జయకేతనం ఎగరవేశారు.

ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో కాంగ్రెస్ నేతలు సరైన మద్దతు ఇవ్వకపోవడంతో సాయికుమార్ గౌడ్ BRSలో చేరినట్లు తెలిసింది. పార్టీ మారినప్పటికీ గ్రామ ప్రజలు ఆయనకు అండగా నిలవడం విశేషం. అభివృద్ధి, స్థానిక సమస్యలపై స్పష్టమైన హామీలతో ప్రజలను ఆకట్టుకున్న సాయికుమార్ గౌడ్ వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు ఫలితాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, ఇక్కడ ఎమ్మెల్యే వీరేశం ఏర్పాటు చేసిన కమిటీ గంపల రామచంద్రారెడ్డిని నామినేట్ చేసినట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో అసంతృప్తి, నాయకత్వ లోపం కాంగ్రెస్‌కు నష్టంగా మారినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఫలితం రామన్నపేట రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని చర్చ సాగుతోంది.

Sthanikam

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వెళ్లడంతో సర్పంచిగా భారీ మెజార్టీ

Article Image

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం బోగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో BRS బలపరిచిన అభ్యర్థి కూనూరు సాయికుమార్ గౌడ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గంపల రామచంద్రారెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంతో సాయికుమార్ గౌడ్ జయకేతనం ఎగరవేశారు.

ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో కాంగ్రెస్ నేతలు సరైన మద్దతు ఇవ్వకపోవడంతో సాయికుమార్ గౌడ్ BRSలో చేరినట్లు తెలిసింది. పార్టీ మారినప్పటికీ గ్రామ ప్రజలు ఆయనకు అండగా నిలవడం విశేషం. అభివృద్ధి, స్థానిక సమస్యలపై స్పష్టమైన హామీలతో ప్రజలను ఆకట్టుకున్న సాయికుమార్ గౌడ్ వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు ఫలితాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, ఇక్కడ ఎమ్మెల్యే వీరేశం ఏర్పాటు చేసిన కమిటీ గంపల రామచంద్రారెడ్డిని నామినేట్ చేసినట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో అసంతృప్తి, నాయకత్వ లోపం కాంగ్రెస్‌కు నష్టంగా మారినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఫలితం రామన్నపేట రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని చర్చ సాగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News