కాంగ్రెస్ కు అండగా నిలవాలి ఎమ్మెల్యే వేముల వీరేశం
కాంగ్రెస్ కు అండగా నిలవాలి ఎమ్మెల్యే వేముల వీరేశం
స్థానికం బృందం
రామన్నపేటను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతా
రామన్న పేట స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా ఇచ్చారు. శుక్రవారం రామన్నపేటలో సీపీఐ–కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గరిక సత్యనారాయణకు మద్దతుగా నిర్వహించిన ప్రచార రోడ్షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రామన్నపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు.
నేను పక్కా లోకల్ ఇక్కడే ఉంటా సేవ చేస్తా
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గరిక సత్యనారాయణ మాట్లాడుతూ, నేను పక్కా లోకల్ ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తాన ని గ్రామంలోని నాలుగు దిక్కులా స్వంత నిధులతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉచితంగా మంచినీరు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామదేవతల ఆలయాల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటానని, గరిక ఫౌండేషన్ ద్వారా పేదలు, ఆపన్నులకు తగిన సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాసం, నాయకులు ఊట్కూరి నర్సింహ, ఎండీ జమీర్ుద్దీన్, వనం చంద్రశేఖర్, గోదాసు పృథ్వీరాజ్, జెల్ల వెంకటేశం, ఎండీ అక్రం, శ్రీమన్నారాయణ, గుత్తా నరసింహారెడ్డి అబ్రహం కుమార్, గొలుసుల ప్రసాద్, కోట సుధాకర్ మోటె రమేష్, లెంకల ప్రవీణ్, కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి