Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 AM

కాంగ్రెస్ కు అండగా నిలవాలి ఎమ్మెల్యే వేముల వీరేశం

కాంగ్రెస్ కు అండగా నిలవాలి ఎమ్మెల్యే వేముల వీరేశం

కాంగ్రెస్ కు అండగా నిలవాలి ఎమ్మెల్యే వేముల వీరేశం
December 13, 2025 07:24 AM 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతా

రామన్న పేట స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా ఇచ్చారు. శుక్రవారం రామన్నపేటలో సీపీఐ–కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గరిక సత్యనారాయణకు మద్దతుగా నిర్వహించిన ప్రచార రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రామన్నపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు.

నేను పక్కా లోకల్ ఇక్కడే ఉంటా సేవ చేస్తా

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గరిక సత్యనారాయణ మాట్లాడుతూ, నేను పక్కా లోకల్ ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తాన ని గ్రామంలోని నాలుగు దిక్కులా స్వంత నిధులతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉచితంగా మంచినీరు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామదేవతల ఆలయాల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటానని, గరిక ఫౌండేషన్ ద్వారా పేదలు, ఆపన్నులకు తగిన సహకారం అందిస్తానని తెలిపారు.


ఈ కార్యక్రమంలో నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాసం, నాయకులు ఊట్కూరి నర్సింహ, ఎండీ జమీర్ుద్దీన్, వనం చంద్రశేఖర్, గోదాసు పృథ్వీరాజ్, జెల్ల వెంకటేశం, ఎండీ అక్రం, శ్రీమన్నారాయణ, గుత్తా నరసింహారెడ్డి అబ్రహం కుమార్, గొలుసుల ప్రసాద్, కోట సుధాకర్ మోటె రమేష్, లెంకల ప్రవీణ్, కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News