కంభంపాటి శ్రీనివాస్ గౌడ్కు కేటీఆర్ ఘన సన్మానం
కంభంపాటి శ్రీనివాస్ గౌడ్కు కేటీఆర్ ఘన సన్మానం
స్థానికం బృందం
పల్లివాడలో బీఆర్ఎస్ విజయకేతనం
కంభంపాటి శ్రీనివాస్ గౌడ్కు కేటీఆర్ ఘన సన్మానం
రామన్నపేట, స్థానికం ప్రతినిధి – కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ భారీ ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
గ్రామస్థాయి పాలనలో బీఆర్ఎస్పై ప్రజల విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. పల్లివాడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సర్పంచ్గా శ్రీనివాస్ గౌడ్ సమర్థవంతంగా నిర్వహిస్తారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి