Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:02 PM

కామవరపుకోట లో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించిన నాయకులు

కామవరపుకోట లో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించిన నాయకులు

కామవరపుకోట లో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించిన నాయకులు
January 18, 2026 07:23 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా కొత్తూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించిన కూటమి నేతలు


కామవరపుకోట జనవరి 18(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వర్ధంతి కొత్తూరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని పంచాయతీల నుంచి కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అని, శక పురుషుడు అని, తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు, వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన ఘనుడని ఆయన మార్గం ఇప్పటికి ఆదర్శమని తెలిపారు. మండల టిడిపి అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని దశ దిశల వ్యాపింప చేశారని పరిపాలనలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆయన మార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశగా నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి మండల టిడిపి అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, బిజెపి మండల అధ్యక్షుడు సూర్యనారాయణ రాజు, జనసేన అధ్యక్షుడు షేక్ వలి, మాజీ ఎంపీపీ మాజీ ఎంపీపీ మద్ది పోటి నాగేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు తూతా బాలాజీ కుమార్, ఘంటా మాధవరావు, సర్పంచులు కరిపోతు అనూష భాగ్యరాజ్, గోరింక దాసు, వేముల నాగేశ్వరరావు, గూడపాటి కేశవరావు, పసుమర్తి పార్థసారధి బాబు, మాజీ సొసైటీ అధ్యక్షులు ఘంటా సత్యం బాబు, జుజ్జురి బాబ్జి, ఏఎంసి డైరెక్టర్ డోలా విజయ్, వజీర్ ఖాన్, సాల్మన్ రాజు, పొన్ను బోయిన సురేష్, మరీదు వెంకటరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి లక్ష్మీనారాయణ, మాన్యం దుర్గారావు, పాల శ్రీనివాస్, వడ్లమూడి సత్యనారాయణ, బేతిన వెంకటరావు, నెక్కలపూడి మల్లికార్జునరావు, వేముల హనుమంతు కరిపోతు కృష్ణ దొడ్డాకుల గంగాధరరావు, బొల్లు బోయిన కళ్యాణం, పాకలపాటి రవి, మొట్టికాయల నాగయ్య, నందిగం శ్రీనివాసరావు, బొప్పన వీరశేఖర రావు, అడపా సత్యనారాయణ, కొల్లిపల్లి ధర్మారావు, కలిదిండి పుల్లంరాజు, మురారి రాజకుమారి, జనసేన వీరబాబు, తోటకూర వెంకటరావు, మున్నంగి శ్రీనివాసరావు, బిజెపి కాకి సురేష్ కుమార్, భాను తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News