కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్
కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్
Sthanikam District Staff Reporter
- విప్లవం లేనిదే పీడిత ప్రజల విముక్తి లేదు..
మోటకొండూరు:బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లు కేవలం దోపిడీ,పీడనలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా షోలిజం రావాలని కోరుకున్నారని ఆ వైపుగా యువతరాన్ని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదునైన నినాదం వెనక నడిపించాడాని ప్రభంజనంలా ప్రజా సమూహాన్ని బ్రిటీష్ సామ్రాజ్యవాదంను నాశనం చేయడానికి దృఢంగా పోరు నడిపాడని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నాయకుడు ఇక్కిరి శ్రీనివాస్ అన్నారు.కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సభ ఇక్కుర్తిలో జరిగింది.ఈ సందర్భంగా కాగడాల వెలుగులతో భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లకు ఘనంగా విప్లవాంజలులు ఘటించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,పీ వై.ఎల్ నాయకులు ఆర్.జనార్ధన్,చిర బోయిన రాజయ్య,సాదుల శ్రీకాంత్,చిర బోయిన భద్రమ్మ,చిర బోయిన లక్ష్మి,ఊరడి అలివేలు,శికిలం వెంకటేష్,చిర బోయిన కొమురయ్య,శికిలం కుమారస్వామి,చిర బోయిన బాలయ్య,చిర బోయిన కృష్ణ,ఆకుల కృష్ణ,వంగాల మధుసూదన్ రెడ్డి,ఊరడి రామ చంద్రు,ఓరుగంటి మైసయ్య,కందుల శ్రీను,పల్లపు రాజు,శివరాత్రి భరత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి