Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 04:47 PM

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య
May 02, 2026 02:29 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కేంద్ర బీజేపీ ప్రభుత్వం యుద్దం పేరుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... సామాన్యుడు పై పరోక్ష ప్రభావం పడే విధంగా ధరలు పెంచడం సరి కాదు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే అంతులేని విధంగా ఒకేసారి 993 రేటుపెంచడం వలన అవి ఉపయోగించే హోటల్స్. చిరు వ్యాపార సంస్థ లు వినియోగదారులపైనే అట్టిభారాన్ని మోపుతారని అన్నారు. అందుకే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల పై భారం పడకుండా చూడాలని వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News