Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:04 PM

కలుషిత నీరే తాగునీరు. రోగాల బారిన పడుతున్న ప్రజలు

కలుషిత నీరే తాగునీరు. రోగాల బారిన పడుతున్న ప్రజలు

కలుషిత నీరే తాగునీరు. రోగాల బారిన పడుతున్న ప్రజలు
May 23, 2026 05:39 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిషన్ భగీరథ నీరు అందించి సమస్య పరిష్కరించాలి

మామునూరులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

ఎర్రుపాలెం, మామునూరు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, కలుషిత నీరు సరఫరా కావడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు శనివారం ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేదని, అయితే గత ఎనిమిది నెలలుగా నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం పశువులు సేదతీరే మామునూరు పేట చెరువు నీటిని శుద్ధి చేయకుండా నేరుగా గ్రామ ట్యాంకుకు ఎక్కించి ప్రజలకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు.

నీటిలో జలగాలు, పాచి, బురద మురుగు ఉండటంతో దుర్వాసన వస్తోందని, ఆ నీటిని తాగడం వల్ల గ్రామస్థులు జీర్ణకోశ, చర్మవ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నా మళ్లీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతరం గ్రామ సర్పంచ్ షేక్ పెద్దబాబు సాహెబ్, ఉపసర్పంచ్ మారబత్తుల ఆదిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి నరేంద్రరెడ్డికి గ్రామస్థుల సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో షేక్ లాల్ సాహెబ్, కన్నేబోయిన శ్రీనివాసరావు, షేక్ కరీం, బేతు శ్రీను, వేల్పుల స్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News