Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 04:07 AM

కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర గ్రామ రైతుల వినూత్న నిరసన

కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర గ్రామ రైతుల వినూత్న నిరసన

కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర  గ్రామ రైతుల వినూత్న నిరసన
May 16, 2026 02:23 PM 279 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని 50 రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం రైతులు కలెక్టరేట్ ఎదుట శనివారం వినూత్న నిరసన చేపట్టారు. గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోసి ఆందోళనకు దిగారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “జై జవాన్.. జై కిసాన్” అంటూ నినాదాలు చేస్తూ తమ గోడును వినిపించారు.

తక్షణమే కాంటాలు వేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు ఆలస్యమవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని, ఆర్థికంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయని వాపోయారు. రైతుల నిరసనతో కలెక్టరేట్ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News