Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎస్సై శివతేజపై ఎలాంటి ఫిర్యాదు లేదు: ఎస్పీ నరసింహ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 04:50 PM

కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర గ్రామ రైతుల వినూత్న నిరసన

కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర గ్రామ రైతుల వినూత్న నిరసన

కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర  గ్రామ రైతుల వినూత్న నిరసన
May 16, 2026 02:23 PM 162 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని 50 రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం రైతులు కలెక్టరేట్ ఎదుట శనివారం వినూత్న నిరసన చేపట్టారు. గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోసి ఆందోళనకు దిగారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “జై జవాన్.. జై కిసాన్” అంటూ నినాదాలు చేస్తూ తమ గోడును వినిపించారు.

తక్షణమే కాంటాలు వేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు ఆలస్యమవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని, ఆర్థికంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయని వాపోయారు. రైతుల నిరసనతో కలెక్టరేట్ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News