కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర గ్రామ రైతుల వినూత్న నిరసన
కలెక్టరేట్ ఎదుట ఇంద్రపాల నగర గ్రామ రైతుల వినూత్న నిరసన
Editor Desk
మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని 50 రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం రైతులు కలెక్టరేట్ ఎదుట శనివారం వినూత్న నిరసన చేపట్టారు. గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోసి ఆందోళనకు దిగారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “జై జవాన్.. జై కిసాన్” అంటూ నినాదాలు చేస్తూ తమ గోడును వినిపించారు.
తక్షణమే కాంటాలు వేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు ఆలస్యమవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని, ఆర్థికంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయని వాపోయారు. రైతుల నిరసనతో కలెక్టరేట్ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి