కలీల్పూర్లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్
కలీల్పూర్లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్
Sthanikam District Staff Reporter krishna
న్యాల్కల్ మండల పరిధిలోని కలీల్పూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన ఇంటి చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్కు తరలించినట్లు జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హన్మంతు తెలిపారు.
వివరాల్లోకి వెళితే…
తేదీ 27-01-2026 న కలీల్పూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి మరియు సూరప్పల ఇళ్లలో పట్టపగలు చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి వారి ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు మరియు కొంత నగదును దొంగలించి పరారైనట్లు బాధితులు ఫిర్యాదు చేయగా,హద్నూర్ పోలీసు స్థావరంలో కేసు నమోదు చేయబడింది.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హన్మంతు ఆదేశాల మేరకు, హద్నూర్ పోలీసు స్థావర ఉప పరిశీలకుడు దోమ సుజీత్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు.
తేదీ 01-02-2026 న ఉదయం గంగ్వార్ కూడలి సమీపంలో స్థానిక ఎస్సై దోమ సుజీత్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ఆటో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులను గమనించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకుని విచారణ చేపట్టగా,అతడు కలీల్పూర్ గ్రామంలో జరిగిన ఇంటి చోరీకి తానే పాల్పడినట్లు అంగీకరించాడు.నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు మరియు చోరీకి ఉపయోగించిన ఆటో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్కు తరలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి