Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:56 PM

కలీల్పూర్‌లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్

కలీల్పూర్‌లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్

కలీల్పూర్‌లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్
February 01, 2026 07:48 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్కల్ మండల పరిధిలోని కలీల్పూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన ఇంటి చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించినట్లు జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హన్మంతు తెలిపారు.

వివరాల్లోకి వెళితే…

తేదీ 27-01-2026 న కలీల్పూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి మరియు సూరప్పల ఇళ్లలో పట్టపగలు చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి వారి ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు మరియు కొంత నగదును దొంగలించి పరారైనట్లు బాధితులు ఫిర్యాదు చేయగా,హద్నూర్ పోలీసు స్థావరంలో కేసు నమోదు చేయబడింది.

ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హన్మంతు ఆదేశాల మేరకు, హద్నూర్ పోలీసు స్థావర ఉప పరిశీలకుడు దోమ సుజీత్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు.

తేదీ 01-02-2026 న ఉదయం గంగ్వార్ కూడలి సమీపంలో స్థానిక ఎస్సై దోమ సుజీత్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ఆటో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులను గమనించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకుని విచారణ చేపట్టగా,అతడు కలీల్పూర్ గ్రామంలో జరిగిన ఇంటి చోరీకి తానే పాల్పడినట్లు అంగీకరించాడు.నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు మరియు చోరీకి ఉపయోగించిన ఆటో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News