Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

కలీల్పూర్‌లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్

కలీల్పూర్‌లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్

కలీల్పూర్‌లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్
February 01, 2026 07:48 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్కల్ మండల పరిధిలోని కలీల్పూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన ఇంటి చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించినట్లు జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హన్మంతు తెలిపారు.

వివరాల్లోకి వెళితే…

తేదీ 27-01-2026 న కలీల్పూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి మరియు సూరప్పల ఇళ్లలో పట్టపగలు చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి వారి ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు మరియు కొంత నగదును దొంగలించి పరారైనట్లు బాధితులు ఫిర్యాదు చేయగా,హద్నూర్ పోలీసు స్థావరంలో కేసు నమోదు చేయబడింది.

ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హన్మంతు ఆదేశాల మేరకు, హద్నూర్ పోలీసు స్థావర ఉప పరిశీలకుడు దోమ సుజీత్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు.

తేదీ 01-02-2026 న ఉదయం గంగ్వార్ కూడలి సమీపంలో స్థానిక ఎస్సై దోమ సుజీత్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ఆటో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులను గమనించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకుని విచారణ చేపట్టగా,అతడు కలీల్పూర్ గ్రామంలో జరిగిన ఇంటి చోరీకి తానే పాల్పడినట్లు అంగీకరించాడు.నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు మరియు చోరీకి ఉపయోగించిన ఆటో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News