- లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన వంగవీటి రామారావు, కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
బుధవారం సూర్యాపేట పట్టణంలోని కిరాణా ఫ్యాన్సీ అసోసియేషన్ హాల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నదని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఈ తరహా సంక్షేమ పథకాలు మహిళల ఆర్థిక భద్రతకు దోహదపడుతున్నాయని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి