Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యాట విష్ణు తల్లి మరణం… సీపీఎం నేతల సంతాపం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 06:05 PM

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన
April 01, 2026 04:21 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్ హెచ్-65 రోడ్డు మరమ్మతుల పనుల నేపథ్యంలో వరద ముంపు సమస్యపై కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి చౌటుప్పల్ చెరువు నుంచి 19వ వార్డు, గాంధీ పార్క్ పెద్ద డ్రైనేజ్ మీదుగా వెల్కమ్ టీ ప్యాలెస్ పక్క గల్లీ ద్వారా వచ్చే నాలా నీటి ప్రవాహంపై జరిగిన చర్చలో ముఖ్యమైన విషయం వెల్లడైంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు తమ ప్రణాళికలో లేదని, అలాగే కాంట్రాక్ట్‌లో కూడా ఆ అంశం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వరద ముంపు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో 19వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్, 12వ వార్డు ప్రజలు, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, అలాగే 13వ వార్డు ప్రజలు ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా బస్టాండ్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సర్వీస్ రోడ్డులో ఉన్న వ్యాపారులు, స్థానిక నివాసితులు ఈ సమస్యపై ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.ఈ సమస్యను స్థానిక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించాలని ప్రజలకు 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News