Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:10 AM

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన
01-04-2026 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్ హెచ్-65 రోడ్డు మరమ్మతుల పనుల నేపథ్యంలో వరద ముంపు సమస్యపై కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి చౌటుప్పల్ చెరువు నుంచి 19వ వార్డు, గాంధీ పార్క్ పెద్ద డ్రైనేజ్ మీదుగా వెల్కమ్ టీ ప్యాలెస్ పక్క గల్లీ ద్వారా వచ్చే నాలా నీటి ప్రవాహంపై జరిగిన చర్చలో ముఖ్యమైన విషయం వెల్లడైంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు తమ ప్రణాళికలో లేదని, అలాగే కాంట్రాక్ట్‌లో కూడా ఆ అంశం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వరద ముంపు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో 19వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్, 12వ వార్డు ప్రజలు, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, అలాగే 13వ వార్డు ప్రజలు ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా బస్టాండ్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సర్వీస్ రోడ్డులో ఉన్న వ్యాపారులు, స్థానిక నివాసితులు ఈ సమస్యపై ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.ఈ సమస్యను స్థానిక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించాలని ప్రజలకు 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

Article Image

ఎన్ హెచ్-65 రోడ్డు మరమ్మతుల పనుల నేపథ్యంలో వరద ముంపు సమస్యపై కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి చౌటుప్పల్ చెరువు నుంచి 19వ వార్డు, గాంధీ పార్క్ పెద్ద డ్రైనేజ్ మీదుగా వెల్కమ్ టీ ప్యాలెస్ పక్క గల్లీ ద్వారా వచ్చే నాలా నీటి ప్రవాహంపై జరిగిన చర్చలో ముఖ్యమైన విషయం వెల్లడైంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు తమ ప్రణాళికలో లేదని, అలాగే కాంట్రాక్ట్‌లో కూడా ఆ అంశం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వరద ముంపు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో 19వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్, 12వ వార్డు ప్రజలు, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, అలాగే 13వ వార్డు ప్రజలు ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా బస్టాండ్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సర్వీస్ రోడ్డులో ఉన్న వ్యాపారులు, స్థానిక నివాసితులు ఈ సమస్యపై ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.ఈ సమస్యను స్థానిక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించాలని ప్రజలకు 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News