Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:57 PM

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన
April 01, 2026 04:21 PM 198 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్ హెచ్-65 రోడ్డు మరమ్మతుల పనుల నేపథ్యంలో వరద ముంపు సమస్యపై కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి చౌటుప్పల్ చెరువు నుంచి 19వ వార్డు, గాంధీ పార్క్ పెద్ద డ్రైనేజ్ మీదుగా వెల్కమ్ టీ ప్యాలెస్ పక్క గల్లీ ద్వారా వచ్చే నాలా నీటి ప్రవాహంపై జరిగిన చర్చలో ముఖ్యమైన విషయం వెల్లడైంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు తమ ప్రణాళికలో లేదని, అలాగే కాంట్రాక్ట్‌లో కూడా ఆ అంశం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వరద ముంపు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో 19వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్, 12వ వార్డు ప్రజలు, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, అలాగే 13వ వార్డు ప్రజలు ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా బస్టాండ్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సర్వీస్ రోడ్డులో ఉన్న వ్యాపారులు, స్థానిక నివాసితులు ఈ సమస్యపై ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.ఈ సమస్యను స్థానిక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించాలని ప్రజలకు 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News