Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:26 AM

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన
April 01, 2026 04:21 PM 205 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్ హెచ్-65 రోడ్డు మరమ్మతుల పనుల నేపథ్యంలో వరద ముంపు సమస్యపై కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి చౌటుప్పల్ చెరువు నుంచి 19వ వార్డు, గాంధీ పార్క్ పెద్ద డ్రైనేజ్ మీదుగా వెల్కమ్ టీ ప్యాలెస్ పక్క గల్లీ ద్వారా వచ్చే నాలా నీటి ప్రవాహంపై జరిగిన చర్చలో ముఖ్యమైన విషయం వెల్లడైంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు తమ ప్రణాళికలో లేదని, అలాగే కాంట్రాక్ట్‌లో కూడా ఆ అంశం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వరద ముంపు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో 19వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్, 12వ వార్డు ప్రజలు, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, అలాగే 13వ వార్డు ప్రజలు ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా బస్టాండ్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సర్వీస్ రోడ్డులో ఉన్న వ్యాపారులు, స్థానిక నివాసితులు ఈ సమస్యపై ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.ఈ సమస్యను స్థానిక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించాలని ప్రజలకు 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News