కల్తీ గుళికలతో రైతులకు భారీ నష్టం – నష్టపరిహారం ఇవ్వాలి
కల్తీ గుళికలతో రైతులకు భారీ నష్టం – నష్టపరిహారం ఇవ్వాలి
Editor Desk
రామన్నపేట: స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో కల్తీ నారు గుళికల వాడకంతో సుమారు 300 ఎకరాల వరి నారు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, సంబంధిత కంపెనీ యజమాని, డీలర్పై పీడీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు గన్నెబోయిన విజయభాస్కర్, నాయకులు సురేందర్ రెడ్డి, గ్రామ రైతులు పిట్ట కృష్ణారెడ్డి, ముక్కామల రవి, కన్నెబోయిన యాదయ్య, జగన్, వెంకటేశ్వర్లు, మల్లేశం, కమలాకర్, శ్రీను, సైదులు, యాదయ్య, వెంకన్న, జైకిషన్, రామచంద్రం, సురేష్, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి