నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో ఎక్సైజ్ సిబ్బంది వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తనిఖీల కోసం వెళ్లిన నకిరేకల్ ఎక్సైజ్ పోలీసులు గీత కార్మికుడు రామ్మూర్తి తయారు చేసిన కల్లు నమూనా తీసుకున్నారు.
అయితే నమూనాను ల్యాబ్కు పంపాల్సిన బాధ్యతను విస్మరించి, అక్కడే కల్లు తాగి, ఒక బాటిల్ పార్సెల్గా తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు తనిఖీ ఖర్చులు భరించాలంటూ కార్మికుడిని కోరడం కలకలం రేపింది.ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి