Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 07:10 PM

కలెక్టర్‌ను ఆశ్రయించిన ఉత్తటూరు వృద్ధురాలి కన్నీటి గాధ

కలెక్టర్‌ను ఆశ్రయించిన ఉత్తటూరు వృద్ధురాలి కన్నీటి గాధ

కలెక్టర్‌ను ఆశ్రయించిన ఉత్తటూరు వృద్ధురాలి కన్నీటి గాధ
January 05, 2026 06:28 PM 390 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టర్ సారూ… కనికరించండి

పండుటాకులకు న్యాయం చేయండి

యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కూటికి దూరమై, కాటికి దగ్గరవుతున్న పండుటాకులైన వయోవృద్ధులకు న్యాయం చేయాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావును సీనియర్ సిటిజన్లు చేతులెత్తి వేడుకుంటున్నారు.రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన మల్లెబోయిన మీనమ్మ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తన గోడును వినిపిస్తూ కన్నీరుమున్నీరయ్యారు. నడవలేని స్థితిలో కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె, తమకు జరిగిన అన్యాయంపై అధికారుల దృష్టి సారించాలని వేడుకున్నారు.మీనమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భర్త మల్లెబోయిన లచ్చయ్య మృతి అనంతరం ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. తాను, భర్త కష్టపడి సంపాదించిన సర్వే నంబర్ 331 భూమిని ఇద్దరు కుమారులు సమంగా పంచుకొని వారి భార్యల పేర్లపై మార్చుకున్నారని వాపోయారు. అంతేకాకుండా తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఇచ్చిన సర్వే నంబర్ 251 భూమిని బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్పి సంతకం చేయించుకొని ఇతరులకు విక్రయించారని ఆరోపించారు.

భూములన్నీ కోల్పోయిన మీనమ్మను కుమారులు పట్టించుకోకపోవడంతో చిన్న కూతురు కత్తుల యాక లక్ష్మీ వద్దనే గత కొన్నేళ్లుగా ఉంటున్నారు. ఇటీవల ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడించినా, “మా అమ్మతో మాకు సంబంధం లేదు” అంటూ కుమారులు నిర్లక్ష్యంగా స్పందించారని ఆమె వేదన వ్యక్తం చేశారు.


గత నెల 6న జిల్లా కలెక్టర్‌ను కలిసిన మీనమ్మను చౌటుప్పల్ ఆర్డీవో వద్దకు పంపించారు. విచారణ అనంతరం వయోవృద్ధుల సంరక్షణ చట్టం–2007 ప్రకారం మీనమ్మ పోషణ, వైద్య ఖర్చుల నిమిత్తం కుమారులు నగదు ఇవ్వాలని ఆర్డీవో ఆదేశించినా, ఆ ఆదేశాలను కుమారులు బేఖాతరు చేశారు. దీంతో కేసు నమోదు చేయాలని రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు ఆర్డీవో లేఖ రాశారు.అయితే పోలీసులను సంప్రదించగా కేసు నమోదు చేయకుండా జిల్లా కలెక్టర్‌ను కలవాలని సూచించడంతో ప్రజావాణిలో మళ్లీ కలెక్టర్‌ను ఆశ్రయించిన మీనమ్మ తన గోడును వెల్లగక్కారు. ఆరోగ్యం సహకరించడం లేదని, ఎడమ కాలు వేలును తొలగించాలని వైద్యులు సూచించారని, వైద్య ఖర్చులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమారులు మల్లెబోయిన లింగయ్య, కోడలు మల్లెబోయిన ముత్తమ్మ, మనుమలు మల్లెబోయిన లక్ష్మణ్, హేమేంద్ర, గణేష్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News