PRINT TIME: April 10, 2026 07:53 AM
కలెక్టర్ చేతుల మీదుగా ఎంఈఓ గవ్వ జ్యోతికి సన్మానం
కలెక్టర్ చేతుల మీదుగా ఎంఈఓ గవ్వ జ్యోతికి సన్మానం
January 04, 2026 11:10 AM
95 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రామన్నపేట ఎంఈఓ గవ్వ జ్యోతిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఘనంగా సన్మానించారు. విద్యారంగ అభివృద్ధికి ఆమె అందిస్తున్న సేవలను ప్రశంసించిన కలెక్టర్, మహిళా సాధికారతకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా డీఈవో సత్యనారాయణ ఎంఈఓ గవ్వ జ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యాధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమం సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకుంటూ స్ఫూర్తివంతంగా సాగింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి